అత్యవసరంగా దిగిన వాయుసేన అపాచీ హెలికాప్టర్‌

భారత వాయుసేనకు చెందిన పోరాట హెలికాప్టర్‌ ‘అపాచీ’ మధ్యప్రదేశ్‌లోని భింద్‌ వద్ద అత్యవసరంగా దిగింది. ఈ లోహ విహంగంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ముందుజాగ్రత్త చర్యగా పైలట్లు ఈ చర్యను చేపట్టారు.

Published : 30 May 2023 05:23 IST

దిల్లీ: భారత వాయుసేనకు చెందిన పోరాట హెలికాప్టర్‌ ‘అపాచీ’ మధ్యప్రదేశ్‌లోని భింద్‌ వద్ద అత్యవసరంగా దిగింది. ఈ లోహ విహంగంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ముందుజాగ్రత్త చర్యగా పైలట్లు ఈ చర్యను చేపట్టారు. ఇది పొలాల్లో దిగిందని అధికారులు తెలిపారు. పైలట్ల  అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాన్ని సరిచేసి మళ్లీ గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దీనికి సాయం చేసేందుకు మరో హెలికాప్టర్‌ను అక్కడికి పంపారు. సాధారణ శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారత దళాల్లో వినియోగిస్తున్న హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత సైన్యానికి చెందిన ధ్రువ్‌ జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని