అపురూపం రూ.75 నాణెం
పార్లమెంటు కొత్త భవన ఆరంభోత్సవంలో ధర్మదండంతో పాటు అందరినీ ఆకర్షించిన మరోటి 75 రూపాయల నాణెం! ఇంతకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ బిళ్లను పొందేదెలా? దీంతో రోజువారీ లావాదేవీలు నిర్వహించొచ్చా? అనేది చాలా మందిలో సందేహం.
ఇంకా ధర నిర్ణయించని కేంద్రం
సుమారు రూ.3,500 ఉండొచ్చని అంచనా
లావాదేవీలకు ఉపయోగపడదు
పార్లమెంటు కొత్త భవన ఆరంభోత్సవంలో ధర్మదండంతో పాటు అందరినీ ఆకర్షించిన మరోటి 75 రూపాయల నాణెం! ఇంతకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ బిళ్లను పొందేదెలా? దీంతో రోజువారీ లావాదేవీలు నిర్వహించొచ్చా? అనేది చాలా మందిలో సందేహం. పొందొచ్చుగాని... లావాదేవీలకు వాడలేరనేదే సమాధానం!
75 రూపాయల నాణెం విలువ రూ.75 మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటు. ఇది పేరుకు 75 రూపాయల నాణెమే అయినా దీని విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది స్మారక నాణెం. ప్రభుత్వం ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని ఆయా సంఘటనల, వ్యక్తుల సంస్మరణార్థం, పథకాల ప్రచారం కోసం ఇలా నాణాలను తయారు చేసి విడుదల చేస్తుంటుంది. వీటిని స్మారక నాణాలంటారు. 1964 నుంచి భారత ప్రభుత్వం ఇలా చేస్తోంది. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం 1964లో మొదటిసారి స్మారక నాణన్ని విడుదల చేశారు. ఇప్పటిదాకా ఇలాంటివి దాదాపు 150 దాకా వచ్చాయి. అందులో భాగంగానే తాజాగా 75 రూపాయల నాణేన్ని కొత్త పార్లమెంటు ఆరంభోత్సవ స్మారకంగా విడుదల చేశారు. 2011 కాయినేజ్ చట్టం ప్రకారం ఇలాంటి స్మారక నాణేలను ముద్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ముంబై, హైదరాబాద్, కోల్కతా, నోయిడాల్లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రాల్లో (మింట్)ల్లో ఇవి తయారవుతాయి.
పొందటమెలా?
ఎవరైనా ఈ నాణేన్ని పొందవచ్చు. ప్రభుత్వ మింట్ వెబ్సైట్ ద్వారా వీటిని సేకరించవచ్చు. లేదా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా వీటిని సరఫరా చేస్తుంది. తాజాగా విడుదల చేసిన రూ.75 స్మారక నాణెం ధర ఎంతో ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. 33 మిల్లీమీటర్ల వ్యాసం, 35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదుశాతం నికెల్, ఐదుశాతం జింక్ కలిపి తయారు చేశారు. దీనిపై ఒకవైపు అశోకస్తూపం ఉంటుంది. మరోవైపు కొత్త పార్లమెంటు భవనం బొమ్మ ఉంటుంది. విలువైన లోహాలను ఉపయోగించి తయారు చేశారు కాబట్టి దీని ధర ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే అందులో వాడిన లోహాల పరిమాణం ఖరీదే కనీసం రూ.1300 దాకా ఉంటుందని లెక్కవేస్తున్నారు. ఉదాహరణకు... కొద్దిరోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేడియో కార్యక్రమం ‘మన్కీ బాత్’ వందో ఎపిసోడ్ను పురస్కరించుకొని రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. దీని ధర రూ.3,494గా పెట్టారు. ఇందులో లోహాల నిష్పత్తి తాజాగా విడుదలైన రూ.75 నాణెంలోని లోహాల నిష్పత్తి దాదాపు ఒకటే! వీటిని కొనుక్కొని దాచుకోవటమే తప్ప వీటితో ఏమీ కొనలేరు. ఇవి బయట మార్కెట్లో లావాదేవీలకు పనికిరావు. కేవలం స్మారకంగా, అపురూపంగా దాచిపెట్టుకునే అమూల్య వస్తువుగా ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి