శాంతిని నెలకొల్పుతాం
తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్లో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో ఆ రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అందరూ సహకరిస్తున్నారు
అమిత్ షా వెల్లడి
మణిపుర్లో వరుస భేటీలు
బాధిత ప్రాంతాల్లో పర్యటన
మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
ఇంటికో ఉద్యోగం
ఇంఫాల్, చురాచాంద్పుర్: తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్లో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో ఆ రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం మహిళలతో మాట్లాడిన ఆయన ఆ తర్వాత పౌర సంఘాలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఆ తర్వాత చురాచాంద్పుర్లో పర్యటించారు. శాంతిని నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తొలుత మంగళవారం ఉదయం ఇంఫాల్లో మహిళా నేతలతో (మీరా పైబీ) అమిత్ షా తేనీటి విందు సమావేశం నిర్వహించారు. మణిపుర్ సమాజంలో వారి పాత్ర ఎంతో కీలకమని, కలిసి శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని నిర్ణయించామని ఆ తర్వాత షా ట్వీట్ చేశారు. పలు పౌర సంఘాల ప్రతినిధులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలితాలనిచ్చాయని, వారంతా శాంతి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని చెప్పారని అమిత్ షా ట్విటర్లో వెల్లడించారు.
అక్కడి నుంచి ఘర్షణలతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన చురాచాంద్పుర్కు కేంద్ర నిఘా విభాగం అధిపతి తపన్ కుమార్ డేకా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలతో కలిసి వెళ్లారు. అక్కడ చర్చి ప్రతినిధులు, కుకీ తెగకు చెందిన కొందరు మేధావులతో చర్చించారు. కుకీ, మేతీ వర్గాలతో సమావేశమయ్యారు. శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్), కుకీ విద్యార్థి సంఘంతో మూడు రౌండ్ల చర్చలు జరిపారు. అయితే మణిపుర్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నామని, అప్పటివరకూ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఐటీఎల్ఫ్ కార్యదర్శి మువాన్ టోంబింగ్ డిమాండు చేశారు మణిపుర్ సమగ్రతను దెబ్బతీసే ఏ చర్యలు చేపట్టినా తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామని క్రీడాకారులు స్పష్టం చేశారు. ఈ మేరకు 11 మంది అమిత్ షాకు మెమోరాండం సమర్పించారు. అందులో అనితా చాను, కుంజరాణి దేవి, సరితా దేవి, సంధ్యారాణి దేవి, మీరాబాయి చాను తదితరులు ఉన్నారు.
పరిహారం ప్రకటన
ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో అమిత్ షా సోమవారం రాత్రి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. చనిపోయిన వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నారు. తక్కువ ధరలకు పెట్రోలు, వంట గ్యాస్, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
ప్రత్యేక అధికారి
మణిపుర్లో పరిస్థితిని అదుపు చేసేందుకు సీనియర్ పోలీస్ అధికారిని కేంద్రం పంపించింది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న రాజీవ్ సింగ్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆయన 1993 బ్యాచ్కు చెందిన త్రిపుర కేడర్ ఐపీఎస్ అధికారి.
వేర్పాటు వాదంతో సంబంధం లేదు.. సీడీఎస్
మణిపుర్ హింసకు రెండు తెగల మధ్య నెలకొన్న వైరమే కారణమని, దానికి వేర్పాటు వాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. సమస్యలు వెంటనే పరిష్కారం కావని, వాటికి కొంత సమయం పడుతుందని తెలిపారు.
రాష్ట్రపతికి కాంగ్రెస్ వినతిపత్రం
మణిపుర్లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ వినతి పత్రం అందజేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని బృందం 12 డిమాండ్లతో కూడిన లేఖను ముర్ముకు అందజేసింది. సుప్రీంకోర్టు సిట్టింగ్, రిటైర్డ్ జడ్జితో ఉన్నత స్థాయి కమిషన్ వేసి విచారించాలని కోరింది.
* మణిపుర్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..