రూ.లక్ష కోట్లతో గిడ్డంగులు
ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం, ఆహారోత్పత్తుల నిల్వ నష్టాలను తగ్గించడమనే బహుళ ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మంత్రి మండలి నిర్ణయం
దిల్లీ: ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం, ఆహారోత్పత్తుల నిల్వ నష్టాలను తగ్గించడమనే బహుళ ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆహార ధాన్యాల నిల్వల సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు రూ.లక్ష కోట్లను వెచ్చించాలన్న ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే అయిదేళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల మేర ఆహార ధాన్యాల నిల్వలకు ఏర్పాట్లు చేయాలని సంకల్పించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తోంది. సంబంధిత వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ మీడియాకు వెల్లడించారు.
* మన దేశంలో ప్రస్తుత గిడ్డంగుల సామర్థ్యం 1,450 లక్షల టన్నులు మాత్రమే. రాబోయే ఐదేళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా మంత్రి దీనిని అభివర్ణించారు.
* ప్రతి బ్లాకులో 2 వేల టన్నుల సామర్థ్యంతో కొత్తగా గోదాములు ఏర్పాటు చేస్తాం. ఇవి అందుబాటులోకి వస్తే తమ ఉత్పత్తులను నష్టానికి విక్రయించాల్సిన అవసరం రైతులకు ఉండదని మంత్రి తెలిపారు. ఆహార ధాన్యాల వృథాను అరికట్టేందుకూ ఇది ఉపయోగపడుతుందన్నారు.
* సుదూర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించాల్సిన అవసరం ఉండదు కనుక రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆహార భద్రతకు భరోసా ఏర్పడుతుందని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థతోనూ ఈ గోదాములను అనుసంధానిస్తామన్నారు.
* గిడ్డంగుల్లో ధాన్యం నిల్వల బాధ్యతలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)కు అప్పగిస్తారు.
అంతర్ మంత్రిత్వ కమిటీ ఏర్పాటు
సహకార రంగంలో గోదాముల నిర్మాణ నిర్ణయం సక్రమంగా అమలయ్యేలా చూడటానికి, అందుకు అవసరమైన నిబంధనల రూపకల్పన కోసం అంతర్ మంత్రిత్వ కమిటీ ఏర్పాటుకూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిటీ ఛైర్మన్గా సహకార మంత్రి వ్యవహరిస్తారు. ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని తొలుత ప్రయోగాత్మకంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని ఎంపిక చేసిన 10 జిల్లాల్లో అమలు జరపనున్నారు.
నగరాల అభివృద్ధికి విదేశీ నిధులు
దేశంలోని వివిధ నగరాల అభివృద్ధి కోసం సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ (సీఐటీఐఐఎస్) 2.0 అనే కొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గం. ఈ పథకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ(ఏఎఫ్డీ), ఐరోపా సమాజం(ఈయూ), కేఎఫ్డబ్ల్యూ, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని చేపట్టనున్నారు. దీనికి ఏఎఫ్డీ రూ.1,760 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ రూ.880 కోట్ల రుణంతో పాటు ఈయూ రూ.102 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి వివరించారు. 2018లో రూ.933 కోట్లతో చేపట్టిన సీఐటీఐఐఎస్ 1.0 పథ]కానికి ఇది కొనసాగింపు.
మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు
ఎన్నడూలేని విధంగా వైవిధ్యమైన పథకాలను అమలుచేస్తూ గత తొమ్మిదేళ్లుగా దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రిమండలి కృతజ్ఞతలు తెలిపింది. 2019లో వరుసగా రెండోసారి విజయాన్ని అందించి దేశానికి సేవ చేసేందుకు అవకాశమిచ్చిన ప్రజలకూ కృతజ్ఞతలు చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.