Gold Smuggling: బంగారాన్ని సముద్రంలో విసిరేసిన స్మగ్లర్లు.. గాలించి 11 కేజీలు వెలికితీశారు!
తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. స్మగ్లర్లు రెండు పడవల్లో శ్రీలంక నుంచి భారత్కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా మే 30వ తేదీన ఒక్కసారిగా అధికారులు ప్రత్యక్షమయ్యారు.
ఆర్కేనగర్, న్యూస్టుడే: తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. స్మగ్లర్లు రెండు పడవల్లో శ్రీలంక నుంచి భారత్కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా మే 30వ తేదీన ఒక్కసారిగా అధికారులు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఓ పడవలోని స్మగ్లర్లు తమవద్ద ఉన్న 11 కేజీల బంగారాన్ని రామనాథపురం జిల్లాలోని మండపం చేపల రేవువద్ద సముద్రంలో విసిరేశారు. అయితే భారత కోస్టుగార్డులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ సిబ్బంది కలిసి 2 రోజులపాటు సముద్రంలో గాలించి ఆ పసిడిని స్వాధీనం చేసుకున్నారు. వడలైవద్ద మరో పడవలో 21.2 కిలోల బంగారాన్ని గుర్తించి అధికారులు పట్టుకున్నారు. ఈ 2 ఘటనల్లో దాదాపు రూ.20 కోట్ల విలువైన 32.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ