Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది.
ఈనాడు, దిల్లీ: విద్యా సంస్థలు డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. యూజీసీ (ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్) రెగ్యులేషన్-2023 పేరుతో రూపొందించిన ఈ నిబంధనలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్కుమార్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి శుక్రవారం దిల్లీలో విడుదల చేశారు. విశ్వవిద్యాలయాల నాణ్యత, సామర్థ్యంపై దృష్టి సారించి పరిశోధన వాతావరణాన్ని బలోపేతం చేయడానికి సరళీకరించిన ఈ నిబంధనలు దోహదపడతాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 2019నాటి నిబంధనలను రద్దు చేసి ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఇవి తేలిగ్గా కనిపించినా కఠినంగా ఉంటాయని చెప్పారు.
* డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకొనే సంస్థలకు వరుసగా మూడేళ్లపాటు 3.01 సీజీపీఏతో న్యాక్-ఏ గ్రేడ్ కానీ, ఆ సంస్థలు నిర్వహించే కోర్సుల్లో రెండో వంతుకు ఎన్బీఏ అక్రిడిటేషన్ కానీ, ఎన్ఐఆర్ఎఫ్ రూపొందించిన ప్రత్యేక కేటగిరీ ర్యాంకుల్లో టాప్-50లో కానీ, ఓవరాల్ ర్యాంకుల్లో టాప్-100లో కానీ ఉండాలి.
* సముదాయంగా విద్యా సంస్థలను నడుపుతున్న వ్యవస్థ కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* విద్యాలయాలను స్పాన్సర్ చేస్తున్న సంస్థలు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిపుణుల కమిటీ అక్కడున్న సౌకర్యాలు, పత్రాలను పరిశీలించి, భాగస్వాములతో మాట్లాడి తుది నిర్ణయం వెలువరిస్తుంది. ఇదంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతుంది.
* కనీసం ఏ, అంతకుమించి గ్రేడ్లు పొందిన డీమ్డ్ యూనివర్సిటీలు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో యూనివర్సిటీల కేటగిరీలో 1 నుంచి 100 ర్యాంకులు పొందిన సంస్థలు ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన సంస్థలు ఆ హోదా పొందిన 5 ఏళ్ల తర్వాత ఆఫ్ క్యాంపస్ సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* న్యాక్లో ఏ కంటే తక్కువ గ్రేడ్ పొందిన సంస్థలు, ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 100కిపైన ఉన్న సంస్థల పని తీరును యూజీసీ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆ కమిటీ చేసిన సూచనల ప్రకారం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే కొత్త కోర్సులు ప్రారంభానికి ఇచ్చిన అనుమతులు రద్దుచేస్తారు.
* డీమ్డ్ యూనివర్సిటీలు ప్రారంభించే కోర్సులు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఎంసీ పరిధిలోకి వచ్చేట్లయితే రుసుములు, సీట్ల విషయంలో ఆయా సంస్థలు నిర్దేశించే నియమాలనే పాటించాలి.
* సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీలు రుసుముల్లో రాయితీలు, ఉపకారవేతనాలతో పాటు సీట్లు కేటాయించొచ్చు.
* డీమ్డ్ యూనివర్సిటీలు తప్పనిసరిగా విద్యార్థులకు అకడెమిక్ క్రెడిట్స్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆ స్కోర్ను వారి డిజిటల్ లాకర్స్లో భద్రపరచాలి. ఈ విద్యాసంస్థలు ట్విన్నింగ్ ప్రోగ్రామ్లు, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్లు, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లు విద్యార్థులకు ఆఫర్ చేయొచ్చు.
* ప్రవేశాల ప్రారంభానికి కనీసం 60 రోజుల ముందు ఈ సంస్థలు యూనివర్సిటీల ప్రాస్పెక్టస్ను తమ వెబ్సైట్లో ఉంచాలి. రుసుములు, వాటి రీఫండ్ విధానం, ఒక్కో కోర్సులో ఉన్న సీట్లు, ప్రవేశార్హతలు, ప్రవేశ ప్రక్రియ గురించి అందులో స్పష్టంగా చెప్పాలి. విద్యార్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వివరాల రికార్డును తప్పనిసరిగా నిర్వహించాలి. ఆ రికార్డులను వెబ్సైట్లో ప్రదర్శించాలి. కనీసం అయిదేళ్లపాటు వాటిని భద్రపరచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు