ఎక్కడపడితే అక్కడ చేతులేసేవారు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సహకరించకపోతే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించేవారు
భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదు
ఎఫ్ఐఆర్లలో సంచలన విషయాలు
దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమతో ఆయన దారుణంగా ప్రవర్తించేవారని, శరీరాన్ని తాకడం, అనుమతి లేకుండా దుస్తుల్లో చేతులు పెట్టడం.. కౌగిలించుకోవడం.. తదితర అసభ్య కార్యకలాపాలకు పాల్పడేవారని మహిళా రెజ్లర్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో పోటీలు జరిగే సమయంలోనూ బ్రిజ్ భూషణ్ ఈ దురాగతాలకు పాల్పడినట్లు ఆరోపించారు. సహకరించకపోతే కెరీర్ను నాశనం చేస్తానని కూడా ఆయన బెదిరించేవారని చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజర్లు గత కొన్ని రోజులుగా దిల్లీలో ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేయడంతో దిల్లీలోని కనాట్ప్లేస్ పోలీసుస్టేషన్లో గత నెల రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్ఐఆర్ ఏప్రిల్ 28న దాఖలైంది. ఇందులో పోక్సో చట్టం సెక్షన్ కూడా ఉంది. ఈ కేసు నిరూపితమైతే బ్రిజ్ భూషణ్కు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
టీషర్ట్లో చేయి పెట్టి..
బ్రిజ్ భూషణ్ తమతో అత్యంత అనుచితమైన, దారుణమైన రీతిలో బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.‘‘నేను అందరితో కలిసి సాధన చేస్తున్నా. ఆ సమయంలో నిందితుడు (బ్రిజ్ భూషణ్) నన్ను రమ్మని పిలిచారు. ఇతర అమ్మాయిలను అసభ్యకరంగా తాకుతుండడం చూసి తిరస్కరించాను. మళ్లీ పిలిచారు. తర్వాత నా టీషర్ట్లో చేయి పెట్టారు. పొట్టపై చేతులు వేశారు. నాభి భాగాన్ని తడిమారు. ఆయనకు భయపడి అమ్మాయిలెప్పుడూ ఒంటరిగా తిరిగేవాళ్లు కాదు. గదుల్లో నుంచి బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవాళ్లం’’ అని ఓ రెజ్లర్ తన ఫిర్యాదులో తెలిపారు.
కోచ్ లేని సమయంలో..!
కోచ్ లేని సమయంలో బ్రిజ్ భూషణ్ తన వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించేవారని ఇంకో రెజ్లర్ ఆరోపణలు చేశారు. ‘‘విదేశాల్లో జరిగిన పోటీల్లో గాయపడ్డాను. అప్పుడు ఆయన (బ్రిజ్భూషణ్) నా వద్దకు వచ్చి.. తనతో సన్నిహితంగా ఉంటే చికిత్సకయ్యే ఖర్చులన్నీ సమాఖ్యే భరిస్తుందని చెప్పారు’’ అని తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.
తనిఖీ పేరుతో..
‘‘నేను మ్యాట్పై సాధన చేస్తున్నా. అకస్మాత్తుగా వచ్చారు. నా మీదకు వంగి అనుమతి లేకుండా టీషర్ట్ను లాగి.. తన చేతులను నా ఛాతీపై పెట్టారు. అక్కడి నుంచి శ్వాస తనిఖీ నెపంతో పొట్ట దగ్గరకు చేతిని తీసుకెళ్లారు’’ అని ఇంకో రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అభినందిస్తారనుకుంటే..
‘‘నేను ఛాంపియన్షిప్లో పతకం గెలిచాను. నా గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆ సమయంలో అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తన గదికి రమ్మంటున్నారని ఫిజియో థెరపిస్టు చెప్పారు. అభినందించడానికి పిలుస్తున్నారనుకున్నా. అక్కడ తన మొబైల్లో నా తల్లిదండ్రులతో మాట్లాడించారు. తర్వాత మంచం వద్దకు రమ్మన్నారు. అకస్మాత్తుగా కౌగిలించుకున్నారు. ఏడ్చేసరికి.. వెనక్కి తగ్గారు. తండ్రిలాంటివాడినని చెప్పి నాటకం ఆడారు’’ అని మరో రెజ్లర్ తన ఫిర్యాదులో చెప్పారు.
వెనక నుంచి వచ్చి..
‘‘అందరం కలిసి ఫోటో తీసుకుంటున్నాం. ఆ సమయంలో ఆయన నా వెనుక నుంచి వచ్చి చేయి వేశారు. ఉలిక్కిపడి వెనక్కి చూశాను. దూరంగా వెళ్లడానికి ప్రయత్నించాను. అయినా నా భుజాన్ని గట్టిగా పట్టుకొని నిరోధించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను’’ అని ఒక రెజ్లర్ పేర్కొన్నారు.
మైనర్నీ వదల్లేదు
రెండో ఎఫ్ఐఆర్లో మైనర్ తండ్రి తన కుమార్తెకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ‘‘పతకం గెలిచిన నా కుమార్తెతో ఫొటో దిగే నెపంతో భుజాలపై బ్రిజ్భూషణ్ చేతులు వేశారు. కదలకుండా గట్టిగా అదిమిపెట్టి.. తన చేతులతో ఆమె శరీరాన్ని తడిమారు’’ అని పేర్కొన్నారు.
9 లోపు అరెస్టు చేయాల్సిందే: రాకేశ్ టికాయిత్
కురుక్షేత్ర(హరియాణా): బ్రిజ్భూషణ్ను ఈ నెల 9లోపు అరెస్టు చేయకపోతే రెజ్లర్లతో కలిసి రైతులు జంతర్ మంతర్లో ధర్నా చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. శుక్రవారం జరిగిన ‘ఖాప్ పంచాయత్’ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలి. రెజ్లర్లకు వ్యతిరేకంగా నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలి. చర్చలతో ఈ సమస్యను కేంద్రం పరిష్కరించాలి. నిందితుడిని అరెస్టు చేయాలి. లేకపోతే ఈ నెల 9న రెజ్లర్లతో కలిసి జంతర్ మంతర్లో కూర్చుంటాం’’ అని టికాయిత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై