8 ఏళ్లుగా చర్యా నివేదికలు పెండింగ్
రైల్వే భద్రత గురించి ప్రభుత్వం నిరంతరం మాట్లాడుతున్నా ప్రమాదాలు జరిగిన తర్వాత కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) ఇచ్చిన నివేదికలపై ఏం చర్యలు తీసుకున్నారన్నది మాత్రం తెలియడంలేదు.
ఈనాడు, దిల్లీ: రైల్వే భద్రత గురించి ప్రభుత్వం నిరంతరం మాట్లాడుతున్నా ప్రమాదాలు జరిగిన తర్వాత కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) ఇచ్చిన నివేదికలపై ఏం చర్యలు తీసుకున్నారన్నది మాత్రం తెలియడంలేదు. 2013-14 నుంచి ఇప్పటి వరకు రైల్వేశాఖ నుంచి రైల్వే సేఫ్టీ కమిషన్కు 15 చర్యా నివేదికలు (యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్) వెళ్లలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ స్థాయీసంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ‘‘గత అయిదేళ్లలో సీఆర్ఎస్ చేసిన సిఫార్సుల్లో 90 శాతాన్ని రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదించడం అభినందనీయం. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రమాదం జరిగిన 30 రోజుల్లో ప్రాథమిక, 180 రోజుల్లో తుది నివేదికను మంత్రిత్వశాఖకు సమర్పించాలి. అయితే వాటిపై ఏం చర్యలు తీసుకున్నది చెబుతూ రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్ని రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కమిషన్కు సమర్పించాలన్న గడువు మాత్రం లేదు. దానివల్ల ఈ చర్యా నివేదికలు సాధారణంగానే ఆలస్యంగా అందుతున్నాయి. రైల్వే మంత్రిత్వశాఖ నుంచి 15 యాక్షన్ టేకెన్ రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో అన్నింటికంటే పాతది 2013-14కు సంబంధించింది. ఇప్పటికి 8 ఏళ్లయింది. ఏటీఆర్లు సమర్పించడంలో ఇంత అసాధారణమైన జాప్యం జరగడం వల్ల అసలు ప్రమాదాలపై దర్యాప్తు చేయడాన్నే నిష్ఫలంగా మారుస్తోంది. అందువల్ల రైల్వేబోర్డు ప్రమాదాలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ కమిషన్కు ఏటీఆర్లను సమర్పించే విధానాన్ని క్రమబద్ధీకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్