ఒళ్లంతా గాయాలు.. కళ్లల్లో ప్రాణాలు
ఒకరో ఇద్దరో కాదు.. కాళ్లూ, చేతులు పూర్తిగా విరిగిపోయినవారు కొందరు.. తలలు పగిలినవారు మరికొందరు.. ముఖమంతా ఛిద్రమైపోయి ఇంకొందరు... ఇప్పటికీ స్పృహలోకి రాని వారు ఎందరో.. ఎటు చూసినా క్షతగ్రాతుల ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడినవారితో నిండిపోయిన కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో దృశ్యమిదీ.. ‘ఈనాడు’ ప్రతినిధి శనివారం రాత్రి ఆ ఆసుపత్రిని సందర్శించి, బాధితులతో మాట్లాడినప్పుడు వారు కన్నీటి సంద్రమయ్యారు.
దయనీయస్థితిలో క్షతగాత్రులు
మాట్లాడే శక్తి లేక వివరాలు చెప్పలేకపోతున్న దైన్యం
ఆసుపత్రుల్లో పడకలు చాలక నేలమీదా వైద్యం
ఒడిశాలోని కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
ఒకరో ఇద్దరో కాదు.. కాళ్లూ, చేతులు పూర్తిగా విరిగిపోయినవారు కొందరు.. తలలు పగిలినవారు మరికొందరు.. ముఖమంతా ఛిద్రమైపోయి ఇంకొందరు... ఇప్పటికీ స్పృహలోకి రాని వారు ఎందరో.. ఎటు చూసినా క్షతగ్రాతుల ఆర్తనాదాలు, హాహాకారాలు.. ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడినవారితో నిండిపోయిన కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో దృశ్యమిదీ.. ‘ఈనాడు’ ప్రతినిధి శనివారం రాత్రి ఆ ఆసుపత్రిని సందర్శించి, బాధితులతో మాట్లాడినప్పుడు వారు కన్నీటి సంద్రమయ్యారు.
మాట్లాడలేని స్థితిలో క్షతగాత్రులు
రైలు ప్రమాదంలో గాయపడినవారు చాలా మంది మాట్లాడలేకపోతున్నారు. పడక పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ తమ గురించి కుటుంబసభ్యులకు తెలియజేయలేక.. అయినవారు దగ్గరలేక వారు అల్లాడిపోతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. వీరిలో కొందరు ఆసుపత్రి వార్డుల్లో ఉండగా.. లోపల పడకలు ఖాళీ లేక మరికొందరు నేలపైనే జీవచ్ఛవాల్లా పడి ఉన్నారు. ప్రమాదానికి గురైన తర్వాత చాలా మంది స్పృహ కోల్పోయారు. స్పృహలోకి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నారు. నిలువెల్లా గాయాలపాలైవారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మరోవైపు రైలు ప్రయాణికుల బంధువులు ఆసుపత్రులకు వచ్చి.. తమవారు అక్కడున్నారేమోనని వెతుకులాడుతూ కనిపించారు. ప్రమాద బాధితుల్లో చాలామంది స్పృహలో లేకపోవటంతో ఆసుపత్రి సిబ్బందే అన్నీ అయి సేవలందిస్తున్నారు. అయితే వారెవరో తెలియకపోవడంతో కుటుంబసభ్యులకో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకో సమాచారం అందించలేని పరిస్థితి. జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారు ఎక్కువ మంది గాయపడ్డారు. వారి వివరాలు రైల్వేశాఖ దగ్గర కూడా అందుబాటులో ఉండవు కాబట్టి క్షతగాత్రులు ఎవరనేది తెలియడం లేదు.
కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కోచోట..
ఒడిశాకు చెందిన నీలాంబర్ పాత్రో కుటుంబం బాలేశ్వర్లో కోరమాండల్ ఎక్కిన అరగంటలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆయన కుటుంబమంతా చెల్లాచెదురైపోయింది. నీలంబర్ పాత్రో భార్య, చిన్న కుమారుడు ఒకచోట, పాత్రో, ఆయన పెద్ద కుమారుడు మరోచోట చిక్కుకుపోయారు. తీవ్ర గాయాలపాలైన ఈ కుటుంబంలో ఇద్దరు బాలేశ్వర్లో, మరో ఇద్దరు కటక్ ఎస్సీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరి క్షేమ సమాచారం మరొకరికి తెలియక వేదన చెందుతున్నారు. తమ కుటుంబసభ్యులు ఎక్కడున్నారో, అసలు బతికున్నారో లేదో తెలియనివారు పదుల సంఖ్యలో ఉన్నారు.
మనీష్కుమార్ది బిహార్. కోరమాండల్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. చేతులు విరిగిపోయాయి. కాళ్లు కదపలేకపోతున్నారు. ముఖమంతా గాయాలే. ఒంట్లో శక్తినంతా కూడదీసుకుంటే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేనంత బలహీనపడ్డారు. శరీరంపై బట్టలైనా సరిగ్గా కప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన గురించి ఇప్పటి వరకు కుటుంబసభ్యులకు తెలియదు. శుక్రవారం రాత్రి నుంచి కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి ప్రాంగణంలో కటికనేలపైనే చికిత్స పొందుతూ నరకయాతన అనుభవిస్తున్నారు.
అబ్దుల్ రజాక్ది పశ్చిమబెంగాల్. బెంగళూరు- హావ్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చాక కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఇప్పటికీ కటక్ చేరుకోలేదు. ఈలోగా తనకు సహాయం అందించేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ చిత్రంలోని బాలుడిది ఒడిశా. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో కుటుంబంతో ప్రయాణిస్తూ ప్రమాదం బారిన పడ్డారు. బాలుడి తండ్రి, తల్లి, సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు, అతని తండ్రి కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. బాలుడి తల్లి, సోదరుడు బాలేశ్వర్లోని ఆసుపత్రిలో ఉన్నారు. ఒకరి క్షేమ సమాచారం మరొకరికి తెలియక అల్లాడిపోతున్నారు. కుటంబంలోని నలుగురూ నాలుగు వేర్వేరు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు వందల కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినట్లయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నేను స్పృహ కోల్పోయా. చాలాసేపటికి స్పృహ వచ్చింది. అప్పటికే నేనున్న బోగీ ఇంజిన్పైకి ఎక్కేసి ఉంది. ఒకవైపు కిటికీకి వేలాడుతున్నాను. చుట్టూ చీకటి. ఏం జరుగుతుందో తెలియలేదు. స్థానికులు వచ్చి కాపాడారు. అప్పటికే నా చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది. నిలబడలేక పాకుతూ కొంతదూరం వచ్చాను. నన్ను కటక్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నా కుటుంబసభ్యుల సమాచారం శనివారం మధ్యాహ్నానికి తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. -
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్