Odisha Train Tragedy: కుమారుడు కనిపించక.. ఎవరిని అడగాలో తెలియక

ఒడిశా ఘటనకు సంబంధించి.. ఆయా రైళ్లలో ప్రయాణించిన తమ వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు.

Updated : 04 Jun 2023 08:32 IST

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశా ఘటనకు సంబంధించి.. ఆయా రైళ్లలో ప్రయాణించిన తమ వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దుర్ఘటన గురించి విన్న భద్రక్‌ జిల్లా సుగొ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు హుటాహుటిన బాలేశ్వర్‌ చేరుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్న తన కుమారుడి గురించి రోదిస్తూ కనిపించినవారినల్లా అడిగారు. మృతదేహాలు ఉంచిన ప్రదేశానికి వెళ్లి ఒక్కో మృతదేహం ముసుగు తొలగిస్తూ కుమారుడు కనపడతాడని చూశారు. అయినా ఫలితం లేకపోవడంతో తన కుమారుడి ఆచూకీ కోసం వేకువజాము నుంచి గాలిస్తున్నానని, ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని