రాష్ట్రీయ రైల్ సంరక్షా కోష్కు నిధుల కోత
రైల్వే భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి. చేస్తున్నది ఒకటి. రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం అయిదేళ్ల కాలం కోసం 2017-18లో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్ఆర్ఎస్కే)ను ఏర్పాటుచేసింది.
ఏటా కేటాయించాల్సిన మొత్తం రూ.20వేల కోట్లు
గత 6 ఏళ్లలో 30% నిధుల తగ్గుదల
రెండేళ్లుగా కేటాయింపులు రూ.11వేల కోట్లకే పరిమితం
ఈనాడు, దిల్లీ: రైల్వే భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒకటి. చేస్తున్నది ఒకటి. రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం అయిదేళ్ల కాలం కోసం 2017-18లో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్ఆర్ఎస్కే)ను ఏర్పాటుచేసింది. ఇందుకు ఏటా రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. అందులో రూ.15వేల కోట్లు బడ్జెట్ నుంచి, రూ.5వేల కోట్లు రైల్వే అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం బాగా పనిచేస్తోందన్న కారణంతో ఈ పథకాన్ని 2022-23 నుంచి మరో అయిదేళ్లకు పొడిగించింది. కీలకమైన భద్రతా పనులకోసం ఆర్థిక వనరులు సమకూర్చి ప్రమాదాలను నివారించడం, అన్మేన్డ్ లెవెల్ క్రాసింగ్స్ని తొలగించడం ఈ కోష్ ప్రధాన లక్ష్యం. ఈ విధానం అమల్లోకి వచ్చిన ఆరేళ్లలో ముందుగా చెప్పినట్లుగా ఏటా రూ.20వేల కోట్ల చొప్పున రూ.1.20 లక్షల కోట్లు కేటాయించి ఖర్చుచేసి ఉండాలి. కానీ 2017-18 నుంచి 2022-23 మధ్యకాలంలో భద్రత కోసం కేటాయించింది కేవలం రూ.85,175.71 కోట్లేనని పార్లమెంటు స్థాయీసంఘం నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ మొత్తం ప్రభుత్వం చెప్పినదానికంటే దాదాపు 30% తక్కువ. గత రెండేళ్లుగా ఈ కోష్కు ఏటా చేయాల్సిన రూ.20వేల కోట్ల కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లకు తగ్గించినట్లు తేలింది. ‘‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ విధానం అమల్లోకి రాకముందు అన్నిరకాల రీప్లేస్మెంట్ అండ్ రెన్యూవల్ పనులు డిప్రిసియేషన్ రిజర్వ్ ఫండ్ పేరుతో జరిగేవి. అయితే ఇప్పుడు భద్రతా కారణాలతోచేపట్టే రెన్యూవల్, రీప్లేస్మెంట్, అప్గ్రెడేషన్ పనులన్నీ రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ కింద జరుగుతున్నాయి. 2017-18లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు యేటా రూ.20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పినా 2022-23 బడ్జెట్ నాటికి కేటాయింపులు రూ.12వేల కోట్లకు తగ్గిపోయాయి. ఇందులో రూ.10వేల కోట్లు బడ్జెట్ నుంచి వస్తే రూ.2వేల కోట్లు రైల్వే అంతర్గత వనరుల ద్వారా సమకూర్చాల్సి ఉంది. అయితే రైల్వే సొంత వనరులనుంచి నిధులు సమకూర్చలేని పరిస్థితిలో ఉంది. అందుకే గత సంవత్సరాల్లో సంరక్షణ కోష్లో మిగిలిపోయిన రూ.1,000 కోట్లను 2022-23 బడ్జెట్లో ఖర్చుపెట్టింది. దాంతో మొత్తం వ్యయం రూ.11వేల కోట్లకు తగ్గిపోయింది. రైల్వేలో ఇదివరకున్న విభిన్న రకాల భద్రతా నిధులను రద్దుచేసి అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి దీర్ఘదృష్టితో ఏర్పాటుచేసిన రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్కు చెప్పిన విధంగా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోతే అది ఏర్పాటుచేసిన ఉద్దేశం విఫలమవుతుంది. కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకొని రైల్వే మళ్లీ పట్టాలెక్కి గత డిసెంబర్ నాటికి 10.4% వార్షిక వృద్ధిరేటు నమోదుచేసిన తరుణంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్రీయ సురక్ష కోష్కు నిధుల కేటాయింపునకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ సంరక్షణ కోష్ ప్రధాన లక్ష్యం రైళ్లు ఢీకొట్టడం, పట్టాలు తప్పడం, మనుషులు లేని లెవెల్క్రాసింగ్ల వద్ద ప్రమాదాలను నివారించడమే. రైల్వేలో 90% ప్రమాదాలు ఈ మూడింటి ద్వారానే జరుగుతున్నాయి. 2017-18లో ఈ కొత్త విధానం ప్రారంభించిన తర్వాత ప్రమాదాలు భారీగా తగ్గినట్లు రైల్వేశాఖ చెప్పుకుంటున్నప్పటికీ 2020-21లో 22కి పరిమితమైన ప్రమాదాలు 2021-22లో 35కి పెరిగాయి. రైల్వే భద్రతాపరమైన అవసరాలు తీర్చడానికే రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్ ఏర్పాటుచేసినట్లు చెప్పినప్పటికీ అందులో కనిపిస్తున్న లోపాలు రైల్వే సామర్థ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. అందువల్ల ప్రస్తుతం కనిపిస్తున్న లోపాలను సరిదిద్దుకొని రైల్ సంరక్షణ కోష్ ఏర్పాటుచేసిన ముఖ్య ఉద్దేశం నెరవేరేలా చూడాలి. దీనిపై రైల్వేశాఖ ప్రధానంగా దృష్టిసారించాలి’’ అని 2023-24 బడ్జెట్ పద్దులపై ఇటీవల ముగిసిన సమావేశాలకు సమర్పించిన నివేదికలో పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల