నేడు భారత్కు అమెరికా రక్షణ మంత్రి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వాషింగ్టన్ పర్యటనకు ముందు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్ రానున్నారు.
రాజ్నాథ్తో కీలక చర్చలు జరపనున్న లాయిడ్
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వాషింగ్టన్ పర్యటనకు ముందు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్ రానున్నారు. బైడెన్తో మోదీ జరిపే చర్చల్లో రానున్న కొత్త రక్షణ సహకార ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆస్టిన్ చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల తర్వాత మోదీ.. అమెరికాకు వెళ్లనున్నారు. ఫైటర్ జెట్ ఇంజిన్ల టెక్నాలజీని మన దేశంతో పంచుకోవాలని జనరల్ ఎలక్ట్రిక్ ప్రతిపాదిస్తోంది. 3 బిలియన్ల డాలర్లకు పైగా విలువైన 30 ఎంక్యూ-9బి సైనిక డ్రోన్లను జనరల్ ఆటమిక్స్ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు జర్మనీ డిఫెన్స్ ఫెడరల్ మంత్రి కూడా సోమవారం 4 రోజుల పర్యటన కోసం భారత్లో అడుగుపెట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ambedkar statue: అగ్రరాజ్యంలో 19 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు