భారత్కు 200 మంది మత్స్యకార్మికుల అప్పగింత
జైళ్ల నుంచి విడుదల చేసిన 200 మంది మత్స్యకారులను పాకిస్థాన్ శనివారం అట్టారీ-వాఘా సరిహద్దులోని సంయుక్త తనిఖీ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ దళాలకు అప్పగించింది.
అమృత్సర్: జైళ్ల నుంచి విడుదల చేసిన 200 మంది మత్స్యకారులను పాకిస్థాన్ శనివారం అట్టారీ-వాఘా సరిహద్దులోని సంయుక్త తనిఖీ కేంద్రం వద్ద బీఎస్ఎఫ్ దళాలకు అప్పగించింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ జారీ చేసిన ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ ఆధారంగా వారంతా శనివారం వేకువజామున ఒంటి గంట ప్రాంతంలో భారత సరిహద్దులోకి ప్రవేశించారని అధికార వర్గాలు వెల్లడించాయి. అరేబియా సముద్రంలోని కాల్పనిక సరిహద్దును పడవల ద్వారా దాటి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని పాకిస్థాన్ వీరిని గతంలో అదుపులోకి తీసుకుంది. స్వదేశానికి వచ్చిన మత్స్యకారులు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?