Odisha train tragedy: వారే స్పందించకుంటే.. ఊహించనంత ప్రాణనష్టం
చుట్టూ చిమ్మచీకటి. మొబైల్ ఫ్లాష్ లైట్లు వేసి చూస్తే కళ్లముందు ఘోర ప్రమాదం. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతలోనే బహానగా ఊరు ఊరంతా అక్కడకు చేరుకుంది. వారంతా యుద్ధభూమిలో సైనికుల్లా వ్యవహరించి బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకురావటం ప్రారంభించారు.
ఆపత్కాలంలో స్థానికుల పెద్దమనసు
యుద్ధప్రాతిపదికన స్పందించిన బహానగా వాసులు
ద్విచక్ర వాహనాలపైనా బాధితుల తరలింపు
సెల్ఫోన్ లైట్లతోనే వందల మందిని కాపాడిన వైనం
ఒడిశాలోని బహానగా నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: దీపక్ రంజన్ బెహరా... విశ్రాంత సైనికోద్యోగి. బహానగా మైదానంలో శుక్రవారం సాయంత్రం తన మిత్ర బృందంతో కలిసి ఆడుతుండగా.. 6.45 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లుగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. పెద్ద మెరుపు కనిపించింది. అంతలోనే ఆర్తనాదాలు.. హాహాకారాలు మిన్నంటాయి. అంతే ఎనిమిది మంది మిత్ర బృందం కలిసి అటువైపుగా పరుగులు పెట్టారు. ఘటనా స్థలంలో చుట్టూ చిమ్మచీకటి. మొబైల్ ఫ్లాష్ లైట్లు వేసి చూస్తే కళ్లముందు ఘోర ప్రమాదం. ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సహాయక చర్యలు మొదలుపెట్టారు. అంతలోనే బహానగా ఊరు ఊరంతా అక్కడకు చేరుకుంది. వారంతా యుద్ధభూమిలో సైనికుల్లా వ్యవహరించి బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకురావటం ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ప్రభుత్వ సహాయ బృందాలు వచ్చేలోపు దాదాపు రాత్రి 9 గంటల వరకూ స్థానికులే అంతా తామై వ్యవహరించారు. ఆ తర్వాత కూడా రాత్రంతా సేవలందించారు. అత్యంత కీలక సమయంలో చురుగ్గా స్పందించారు. వారే లేకుంటే బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణనష్టం ఊహకందనంత తీవ్రంగా ఉండేది. ప్రమాదం జరిగిన రోజు అనుభవాలను సహాయక చర్యల్లో మొట్టమొదట పాల్గొన్న దీపక్ రంజన్ బెహరా, శుభంకర్ జెనా వారి మిత్ర బృందం ‘ఈనాడు ప్రతినిధి’కి వివరించారు. అవి వారి మాటల్లోనే...
బోగీల్లో ఒకరిపై ఒకరు గుట్టల్లా పేరుకుపోయి...
‘‘మేము బోగీల్లోకి వెళ్లేసరికి లోపల ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు గుట్టల్లా పేరుకుపోయి ఉన్నారు. మనుషులపై నుంచి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. చాలామంది కింద భాగంలో చిక్కుకుపోయి కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరినీ బయటకు లాగాం. లోపలంతా చిమ్మచీకటి. ఏమీ కనిపించట్లేదు. అప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కదల్లేని స్థితిలో ఉన్నారు. వారిని భుజాలపై మోసుకుంటూ కిందకు దించాం. మృతదేహాలను ఓ చోట పెట్టాం. బతికున్నవారిని బయటకు తీశాం. మా బృందం 88 మందిని ప్రాణాలతో కాపాడింది. ఊరు ఊరంతా వందల మందిని ఇలాగే రక్షించింది.
సైకిల్, బైక్ ఏది ఉంటే దానిపైనే..
ప్రమాదాల సమయంలో మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఆలోగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగలిగితే వారి ప్రాణాలు కాపాడేందుకు వీలుంటుంది. అందుకే కాపాడిన వారందరినీ అందుబాటులో ఉన్న వాహనాలపై తరలించాం. కొందర్ని సైకిళ్లపైన, మరికొందర్ని ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో తీసుకెళ్లాం. ప్రమాదం జరిగిన గంట తర్వాత అంబులెన్సులు వచ్చాయి. ఈలోపు స్థానికులే సొంత వాహనాలపై చాలామందిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనివల్ల చాలావరకూ ప్రాణనష్టం తగ్గింది.
మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుగులోనే
ప్రమాదం జరిగిన తర్వాత మొదటి రెండు గంటల పాటు మొబైల్ ఫ్లాష్లైట్ల వెలుగులోనే పనిచేశాం. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించి బోగీల్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. ఆ విపత్తు సమయంలో ఆ ఫ్లాష్ లైట్లే ఎంతోమంది ప్రాణాలు కాపాడాయి.
ఆ గర్భిణి వేదన హృదయ విదారకం
మేం వెళ్లిన ఓ బోగీలో ప్రయాణికుల మధ్యలో ఓ గర్భిణి కూరుకుపోయి కనిపించారు. ఆమె రోదనలు హృదయవిదారకంగా అనిపించాయి. అతి కష్టమ్మీద ఆమెను బయటకు తీసుకురాగలిగాం. కానీ తన ఇద్దరు పిల్లలు పైన ఉండిపోయారని, వారిని బయటకు తేవాలంటూ ఆమె ప్రాధేయపడ్డ తీరు ఇప్పటికీ మా కళ్లలో అలా మెదులుతూనే ఉంది. నాటి భీకర, బీభత్స దృశ్యాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.’’
స్వచ్ఛంద సంస్థల సహకారం..
బోగీల్లో చిక్కుకున్నవారిని కాపాడడమే కాదు.. సహాయక పనుల్లో పాల్గొన్నవారికి ఆహార పానీయాలు అందిస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాతృత్వాన్ని చాటుకున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ మంచినీళ్లు, అరటి పళ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందించింది. ఒడిశాలోని పారదీప్ పోర్టు ట్రస్ట్ వారు వైద్యసేవలు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM