Odisha train tragedy: మావాళ్లు ఎక్కడ..?
ఛిద్రమైపోయిన తలలు... రెండుగా చీలిపోయి, రూపుకోల్పోయిన ముఖాలు... ఛిన్నాభిన్నమైపోయిన శరీరాలు.. చెల్లాచెదురైపోయిన అవయవాలు... ఇలా గుర్తుపట్టటానికి వీల్లేని విధంగా మృతదేహాలున్నాయి. ఏ శవం ఎవరిదో తెలియని దుస్థితి. దీంతో వాటిని గుర్తించటం సవాలుగా మారింది.
ఎవరి శవం ఏదో గుర్తించలేని దైన్యం
ఆచూకీ దొరక్క బంధువుల పరుగులు
ఫొటోలతో.. మృతదేహాల కోసం వెదుకులాట
కనీస సమాచారం కూడా అందక ఆవేదన
బాలేశ్వర్లో ఎటుచూసినా కన్నీటి సుడులే
గేదెల భరత్కుమార్
బాలేశ్వర్ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
కన్నకొడుకు ఎక్కడున్నాడా అని..
జెనిమా మొండల్ది పశ్చిమబెంగాల్. పొట్టకూటి కోసం చెన్నై బయల్దేరి రైలుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన 32 ఏళ్ల కుమారుడు మంజూర్ అలీ మొండల్ మృతదేహం కోసం రెండు రోజులుగా ఆమె తిరగని చోటు, వెతకని ప్రదేశం లేదు. కనిపించిన వాళ్లందరికీ తన కుమారుడి ఫొటో, ఆధార్ కార్డు చూపిస్తూ మృతదేహం గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. అయినా ఆదివారం సాయంత్రం వరకూ ఆచూకీ దొరకలేదు. చివరికి బాలేశ్వర్లో మృతదేహాలు భద్రపరిచిన నోసీ పార్కు వద్దకు చేరుకుని అక్కడున్న మృతుల ఫొటోలు చూస్తూ.. వాటిలో తన కుమారుడి ఫొటో ఉందా అంటూ ఆత్రుతగా వెతుకుతూ కనిపించారు. వరదలా పొంగుతున్న కన్నీటిని దిగమింగుకుని మరీ.. కుమారుడి మృతదేహం కోసం ఆమె వెతుకుతున్న తీరు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తోంది. ఒక్క జెనిమా మొండల్.. మాత్రమే కాదు.. వందల మందిది ఇలాంటి దయనీయ స్థితే.
ఛిద్రమైపోయిన తలలు... రెండుగా చీలిపోయి, రూపుకోల్పోయిన ముఖాలు... ఛిన్నాభిన్నమైపోయిన శరీరాలు.. చెల్లాచెదురైపోయిన అవయవాలు... ఇలా గుర్తుపట్టటానికి వీల్లేని విధంగా మృతదేహాలున్నాయి. ఏ శవం ఎవరిదో తెలియని దుస్థితి. దీంతో వాటిని గుర్తించటం సవాలుగా మారింది. అధికారులు ప్రతి మృతదేహంపైన ఓ నంబరు వేసి.. అది కనిపించేలా మృతదేహాల ఫొటోలు తీసి వాటిని ఓ టేబుల్పై ఉంచారు. మృతుల కుటుంబీకులు ఆ ఫొటోలు చూసుకుని వాటిలో తమవారు ఉన్నారేమోనని గుర్తించాల్సిందే. అయితే ఆ ఫొటోల్లో మృతదేహాలు ఛిద్రమైపోయి ఉండటంతో చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 180 మంది మృతదేహాలను తొలుత బాలేశ్వర్లోని నోసీ ఇండస్ట్రియల్ పార్కు వద్దకు తీసుకొచ్చి భద్రపరిచారు. ఆ ప్రాంతానికి ఈనాడు ప్రతినిధి వెళ్లి పరిశీలించగా.. ఇలాంటి అత్యంత హృదయవిదారక పరిస్థితులు కళ్లకు కట్టాయి.
ఇద్దరు కుమారులను కోల్పోయి..
చేతికి అందివచ్చిన ఇద్దరు కుమారులను రైలు ప్రమాదంలో కోల్పోయి.. వారి మృతదేహాల కోసం వెతుకులాడుతున్న ఈయన పేరు దినేష్. బిహార్ వాసి. ఈయన కుమారులు ప్రమోద్కుమార్, సుబోధ్కుమార్ పనుల కోసం చెన్నై వెళ్తూ రైలుప్రమాదంలో మరణించారు. విషయం తెలిసి బిహార్ నుంచి బాలేశ్వర్కు చేరుకున్న దినేష్.. తన కుమారుల మృతదేహాల కోసం శనివారం నుంచి వెతుకుతూనే ఉన్నారు. అయినా దొరకలేదు. బాలేశ్వర్లోని నోసీ పార్కు వద్ద మృతదేహాలను భద్రపరిచిన ప్రదేశంలో ఉన్న మృతుల ఫొటోల్లో తన కుమారులు ఫొటోలు ఉన్నాయేమోనని పదే పదే వెతికినా ఫలితం లేదు. నిద్రాహారాలు లేకుండా వారి మృతదేహాల కోసం వెతుకుతూనే ఉన్నారు.
తమవారు ఎక్కడున్నారా అని...
కుమారుల మృతదేహాల కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు.. తండ్రి మృతదేహం కోసం వెతుకుతున్న పిల్లలు.. భార్య మృతదేహం కోసం వెతికే భర్త... భర్త ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న భార్య.. తమవారి మృతదేహాల కోసం వెతికి వెతికి.. ఆచూకీ తెలియక నిస్సహాయ స్థితిలో దీనంగా రోదిస్తున్న కుటుంబసభ్యులు... ఇలా అక్కడ ఎవర్ని తట్టినా కన్నీరు వరదలా తన్నుకొస్తోంది. పొట్టకూటి కోసం పనులు వెతుక్కుందామని దూరతీరాలకు బయల్దేరిన బడుగుజీవులే బాధితుల్లో ఎక్కువగా ఉన్నారు. కుటుంబం మొత్తాన్ని పోషిస్తామంటూ బయల్దేరిన తమవాళ్లు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారని తెలిసి.. కనీసం వారికి గౌరవంగా అంత్యక్రియలైనా చేద్దామని మృతదేహాల కోసం పరుగుపరుగున వచ్చారు. కానీ ఇక్కడికొస్తే, కనీస సమాచారం ఇచ్చేవారూ లేరు. గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాల్లో తమవారివి ఉన్నాయేమోనని తరచి తరచి చూస్తున్న వారిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
36 గంటలు వెతికితే మృతదేహం దొరికింది
పశ్చిమబెంగాల్కు చెందిన దీనబంధు రఘు, సచిన్ రవుత్ల కుటుంబీకుడు తపస్కుమార్ రవుత్ (21) రైలుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తోటి ప్రయాణికుల ద్వారా విషయం తెలిసిన కుటుంబీకులు వెంటనే బాలేశ్వర్కు చేరుకున్నారు. శనివారం ఉదయం నుంచి మృతదేహం కోసం వెతుకుతూనే ఉన్నారు. దాదాపు 36 గంటల పాటు తిరిగిన తర్వాత.. ఆదివారం సాయంత్రం బాలేశ్వర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహం దొరికింది.
చివరి చూపూ గగనమే...
నోసీ ఇండస్ట్రియల్ పార్కు వద్ద ఉన్నవాటిలో ఆదివారం సాయంత్రానికి 97 మృతదేహాలనే గుర్తించగలిగారు. మిగతా వాటిని భువనేశ్వర్, కటక్లోని వేర్వేరు చోట్లకు పంపించేశారు. దీంతో మృతుల కుటుంబీకులకు తమవారి మృతదేహాలను వెతుక్కోవటం పెద్ద సవాలుగా మారింది. అయిన వారిని కోల్పోయి అసలే విషాదంలో ఉన్న వారు.. ఒక చోట నుంచి మరోచోటకు పరుగులు పెడుతూ.. మృతదేహాల కోసం వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల్లో ఏ రాష్ట్రం వారు ఎందరనే కనీస సమాచారం కూడా అధికారులు ప్రకటించట్లేదు.
బెంగాల్, బిహార్ వారే అధికం
ప్రమాద మృతుల్లో అత్యధికులు జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారే. వీరిలో పశ్చిమబెంగాల్, బిహార్కు చెందినవారే అధికం. వారి వివరాలేవీ రిజర్వేషన్ చార్టుల ఆధారంగా ఉండే ప్రయాణికుల జాబితాల్లో లేవు. దాంతో.. వారి సమీప బంధువులు తమవారి ఆధార్ కార్డులు, ఫొటోలు తీసుకొచ్చి... కనిపించిన ప్రతి ఒక్కరికీ వాటిని చూపించి ఎక్కడైనా చూశారా అంటూ ఆరాతీస్తున్నారు. మృతుల ఫొటోలతో తమ వద్ద ఉన్న ఫొటోలను సరిపోల్చుకుంటూ వారి ఆచూకీ గురించి వెతుక్కుంటున్నారు.
అయినవారి ఆచూకీ లేక..!
ఫొటోలు, ఆధార్ కార్డులు పట్టుకుని తిరుగుతున్న బంధువులు
ఈనాడు డిజిటల్, బాలేశ్వర్: అన్ రిజర్వ్డ్ బోగీల్లో వెళ్లినవారి సమాచారం తెలియక బంధువులు వారి ఫొటోలు, ఆధార్ కార్డులతో కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతున్నారు..
మా నాన్న కనిపించడం లేదు
కోల్కతా నుంచి 12మంది కోరమాండల్ ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. వారిలో 11మంది క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. మా నాన్న సురేంద్ర సర్దార్ ఆచూకీ తెలియలేదు. రైల్వేవారిని అడుగుదామని వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నాలుగు గుర్తుతెలియని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వెతకడానికి అక్కడికి వెళ్తున్నాం.
సోమేష్ సర్దార్, కోల్కతా
ఏమయ్యారో తెలియడం లేదు
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎక్కిన మా బంధువు నితమ్రాయ్ వివరాలు తెలియలేదు. ఎవరిని అడగాలో తెలియక రెండురోజుల నుంచి తిరుగుతున్నాం. రైల్వే అధికారులను అడిగితే సరిగ్గా చెప్పడం లేదు. అతడికి తండ్రి లేడు. తల్లి, భార్య, పిల్లలున్నారు. వారు తిరగలేక మమ్మల్ని పంపించారు. ఎక్కడ వెతికినా సమాచారం రాలేదు.
సిమాన్సింగ్, పశ్చిమబెంగాల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు