నైరుతి రాక మరింత ఆలస్యం
నైరుతి రుతుపవనాలు ముందుగా భావించినట్లు ఈ నెల 4న కేరళను తాకలేదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది.
దిల్లీ: నైరుతి రుతుపవనాలు ముందుగా భావించినట్లు ఈ నెల 4న కేరళను తాకలేదని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. మరో మూణ్నాలుగు రోజుల్లో తాకే అవకాశముందని వెల్లడించింది. ‘‘దక్షిణ అరేబియా సముద్రంలో పడమటి గాలులు పెరుగుతున్నందున పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వాటి డెప్త్ క్రమేపీ పెరుగుతోంది. అది జూన్ 4న సముద్ర సగటు మట్టానికి 2.1 కిలోమీటర్లకు చేరుకుంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయి. కేరళను రుతుపవనాలు తాకే అనుకూల పరిస్థితులు మెరుగవుతాయని భావిస్తున్నాం’’ అని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ఆలస్యం వానాకాలం సాగుతోపాటు దేశంలోని మొత్తం వర్షపాతంపైనా ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్పై.. భారతీయుల మొగ్గు!
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం