మృతదేహాలను భద్రపరచడం.. పెనుసవాలు
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంకా 120 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తంగా ఘటనాస్థలి నుంచి భువనేశ్వర్కు 187 మృతదేహాలను తరలించగా.. గుర్తించని శవాలను ‘అన్ఐడెంటిఫైడ్ బాడీస్’గా నిర్ధరించి నగరంలోని పలు ఆసుపత్రుల శవాగారాలకు తరలించారు.
వెబ్సైట్లో మృతుల చిత్రాలు
ఈనాడు, భువనేశ్వర్, విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంకా 120 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తంగా ఘటనాస్థలి నుంచి భువనేశ్వర్కు 187 మృతదేహాలను తరలించగా.. గుర్తించని శవాలను ‘అన్ఐడెంటిఫైడ్ బాడీస్’గా నిర్ధరించి నగరంలోని పలు ఆసుపత్రుల శవాగారాలకు తరలించారు. గుట్టలుగా పడి ఉన్న శవాలను భద్రపర్చడం యంత్రాంగానికి సవాలుగా మారింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేసి శవాలను సంబంధీకులకు అప్పగించేలా ఏర్పాట్లు చేశారు. ఐఏఎస్ అధికారి తిరుమనాయక్ను పర్యవేక్షకుడిగా నియమించారు. 1929 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని, కటక్ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్సీబీ వైద్య కళాశాల, భువనేశ్వర్ రైల్వేస్టేషన్, విమానాశ్రయం వద్ద సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మృతుల్లో ఏపీకి చెందినవారు ఉంటే చూసుకునేందుకు వీలుగా ఆ ఫొటోలతో కూడిన జాబితాలను మన రాష్ట్ర అధికారులకు అందించారు.
భయానకంగా చిత్రాలు..
గుర్తించని మృతదేహాలను అధికారులు ఫొటోలు తీసి వెబ్సైట్లలో ఉంచారు. www.bmc.gov.in, www.osdma.org లో మృతుల చిత్రాలు పరిశీలించవచ్చు. ప్రమాదం ఈ నెల 2న రాత్రి జరగ్గా, ఆదివారం రాత్రి వరకూ 120 మృతదేహాల కోసం సంబంధీకులు ఎవరూ రాలేదు. వారికి సంబంధించిన పర్సులు, ఫొటోలు, ఓటరు కార్డులు, సెల్ఫోన్లు వంటివి మృతదేహాలపైనే ఉంచి ఫొటోలు తీసి వెబ్సైట్లో పెట్టారు. ఫొటోలు తీసే సమయానికే చాలా మృతదేహాలు గుర్తించలేనంతగా మారిపోయాయి. సగానిపైగా శవాలు రంగుమారాయి. చనిపోయిన వారిలో పురుషులే అధికం. చిన్నారులూ కొందరున్నారు. చాలామంది ముఖాలకు దెబ్బలు తగిలి ఉబ్బిపోయాయి. కొన్నైతే తల నుంచి ఉదర భాగం వరకు, మరికొన్ని చాలావరకు శరీర భాగాలు లేకుండా ఉన్నాయి. నుజ్జయిపోవడంతో వాటిని గుడ్డలో చుట్టిపెట్టారు. ఈ మృతులంతా బోగీల కింద నలిగిపోయినట్లు తెలుస్తోంది. కొందరు తీవ్రమైన దెబ్బలతో మట్టిలో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నారు.
ప్రధాని ఫోన్ కాల్తో భువనేశ్వర్కు మాండవీయ
భువనేశ్వర్లోని ఎయిమ్స్కు 110 మృతదేహాలు తరలించగా, మిగతా వాటిని కాపిటల్, అమ్రి, సమ్తో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో భద్రపరిచారు. కోల్డ్ స్టోరేజీల్లోనూ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్టు ఒడిశా ఆరోగ్యశాఖ కార్యదర్శి శాలినీ పండిట్ చెప్పారు. ఎయిమ్స్లో గరిష్ఠంగా 40 శవాలనే ఉంచేందుకు వీలుండగా, ఇప్పుడు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. శవపేటికలు, ఐస్, ఫార్మాలిన్ రసాయనాలు సేకరిస్తున్నారు. వేడి వాతావరణం మరో ప్రతిబంధకంగా మారింది. ఈ విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఒడిశా అధికారులు ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వెంటనే ప్రధాని మోదీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో మాట్లాడి ఎయిమ్స్లో మృతదేహాలను భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి భువనేశ్వర్కు చేరుకొన్న మాండవీయ.. అధికారులతో సమీక్షించారు. మృతులు పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో గుర్తించడం పెనుసవాలుగా మారిందని ఒడిశా సీఎస్ ప్రదీప్ జెనా తెలిపారు.
ఫోన్నంబర్లతో గుర్తించవచ్చా?
ఆచూకీ లభించని వారికి సంబంధించిన ఫోన్ నంబర్ల ద్వారా వారి చిరునామా గుర్తించి, వాళ్లు ఏమయ్యారనే సమాచారం తెలుసుకునే వీలుంది. ఫోన్ నంబర్లతో సిమ్ తీసుకునే సమయంలో టెలికం సంస్థలకు ఇచ్చిన చిరునామాతో వాళ్లను గుర్తించేందుకు అవకాశముంది. పోలీసు శాఖకు టెలికం సంస్థల డేటాబేస్తో అనుసంధానం ఉంటుందని, దీంతో వారి చిరునామాలు గుర్తించనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.