Snake: పామును కొరికి చంపిన బాలుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో ఇంటి ముందు ఆరుబయట ఆడుకొంటున్న బాలుడు పామును కొరికి చంపాడు.

Updated : 05 Jun 2023 07:54 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో ఇంటి ముందు ఆరుబయట ఆడుకొంటున్న బాలుడు పామును కొరికి చంపాడు. కొత్వాలి మహ్మదాబాద్‌ ప్రాంతం మద్నాపుర్‌ గ్రామంలో దినేశ్‌సింగ్‌ అనే వ్యక్తి తన మూడేళ్ల కుమారుడు, తల్లి (బాలుడి నాయనమ్మ)తో కలిసి ఉంటున్నాడు. శనివారం ఆడుకొంటున్న బాలుడికి ఆ సమయంలో అక్కడకు వచ్చిన పాము కంటపడింది. ఎటువంటి భయం లేకుండా దాని దగ్గరకు వెళ్లి చేతులతో పట్టుకొని నోటితో కొరికి చంపాడు. తర్వాత బాలుడి ఆరోగ్యం విషమించి స్పృహతప్పి పడిపోయాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు చనిపోయిన పాముతోపాటు బాలుణ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంతకు ముందెన్నడూ తన మనవడు ఇలా ప్రవర్తించలేదని నాయనమ్మ సునీతాదేవి చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని