జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండితే ఓటు
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరినీ ఓటర్లుగా చేర్చాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
వార్షిక ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం
5 రాష్ట్రాలు మినహా మిగిలినచోట్ల ప్రక్రియ
ఈనాడు, దిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరినీ ఓటర్లుగా చేర్చాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ సీఈవోలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల అధికారులు దీనిని అనుసరించాలని స్పష్టం చేసింది. 2024 జనవరి 1ని గడువుగా పెట్టుకుని వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు మే 29వ తేదీతో ఉన్న ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లో కొత్త ఓటర్లను చేర్చడానికి జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1ని అర్హత తేదీలుగా నిర్ణయించినందున జనవరి 1ని గడువుగా పెట్టుకుని ఓటర్ల వార్షిక సవరణ కార్యక్రమం చేపట్టాలని పేర్కొంది. ఈ కొత్త ఓటర్ల జాబితాను జనవరి 25న జరిగే జాతీయ ఓటర్ల జాబితాకు ముందే ప్రచురించడంవల్ల కొత్తగా చేరిన ఓటర్లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవంనాడు పండగ వాతావరణంలో ఫొటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయొచ్చని పేర్కొంది.
సవరణకు ఎన్నికల సంఘం విధించిన గడువులు
1. ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వోలకు చట్టాలు, మార్గదర్శకాలపై శిక్షణ - 01.06.2023 నుంచి 20.07.2023 వరకు.
2. బీఎల్వోల ఇంటింటి తనిఖీ - 21.07.2023 నుంచి 21.08.2023 వరకు.
3. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ/సర్దుబాటు, ఓటర్ల జాబితా/ ఫొటో గుర్తింపు కార్డుల్లో లోటుపాట్ల దిద్దుబాటు. గుర్తింపు కార్డుల్లో మంచి నాణ్యమైన ఫొటోలు చేర్చడం. సెక్షన్లు/ భాగాలను పునర్నిర్వచించడం, పోలింగ్ స్టేషన్ల సరిహద్దుల ఖరారు, లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దడానికి తుది వ్యూహాన్ని ఖరారు చేయడం, అందుకు తగిన గడువులు నిర్దేశించడం. కంట్రోల్ టేబుల్ అప్డేషన్- 22.08.2023 నుంచి 29.09.2023 వరకు.
4. ఫార్మాట్ 1 నుంచి 8 వరకు సంసిద్ధం చేయడం- 30.09.2023 నుంచి 16.10.2023 వరకు.
5. సమీకృత ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురణ- 17.10.2023.
6. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ దాఖలుకు గడువు- 17.10.2023 నుంచి 30.11.2023 వరకు.
7. ప్రత్యేక ప్రచార తేదీలు- క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్లో రెండు శనివారాలు, రెండు ఆదివారాలు. తేదీని సీఈవోలు ఖరారు చేయాలి.
8. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం- 26.12.2023.
9. సవరించిన జాబితాను తనిఖీ చేసి తుది ప్రచురణ కోసం కమిషన్ అనుమతి కోరడం. డేటాబేస్ అప్డేట్ చేసి సప్లిమెంట్లు ప్రింట్ చేయడం- 01.01.2024.
10. ఎన్నికల జాబితా తుది ప్రచురణ- 05.01.2024.
మార్గదర్శకాలు
* కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేటప్పుడుగానీ, ఉన్న స్టేషన్ను పునర్వ్యవస్థీకరించేటప్పుడుగానీ కుటుంబాలు రెండు స్టేషన్ల మధ్య విడిపోకుండా చూడాలి. ఒక కుటుంబంలోని సభ్యులంతా ఒకే స్టేషన్ పరిధిలోకి వచ్చేలా జాగ్రత్త పడాలి.
* 1500 ఓటర్లకు మించిన పోలింగ్ స్టేషన్లను హేతుబద్ధీకరించాలి. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించకముందే ఈ పని పూర్తి చేయాలి.
* ఒక భవనంలో నివసించే ఓటర్లంతా ఒకేచోట ఉండేలా చూడాలి. విలీనం చేసిన పోలింగ్ స్టేషన్లలోని ఓటర్లు రెండు కిలోమీటర్లకు మించి దూరం ప్రయాణించే లేదంటే సహజ సిద్ధమైన అడ్డంకులు దాటి వెళ్లే పరిస్థితులు కల్పించకూడదు.
* ఓటరు గుర్తింపు కార్డులో తప్పులుంటే సరిదిద్దాలి. ఒక ఓటరు పేరు మీద ఒకటికి మించి ఓటరు కార్డులంటే తాజాగా జారీ చేసిన కార్డు ఉంచి మిగతా వాటిని రద్దు చేయాలి.
* ఒకే ఓటరు నంబరుతో పలువురు ఓటర్లు ఉంటే తొలిసారి ఆ నంబరు కేటాయించిన ఓటరును ఉంచి మిగతా వారందరికీ కొత్త ఓటరు కార్డులు, నంబర్లు జారీ చేయాలి. వారి నుంచి పాత ఫొటో గుర్తింపు కార్డులన్నీ సేకరించి ధ్వంసం చేసి, ఆ వివరాలన్నీ రికార్డులో నమోదు చేయాలి.
* ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరే వారందరి నుంచి ఫాం-6 తీసుకోవాలి. జాబితాలో చేర్చడానికి ప్రతిపాదించిన పేర్ల పట్ల తెలిపే అభ్యంతరాలకు, జాబితా నుంచి పేర్లు తొలగించాలంటే విధిగా ఫాం-7 స్వీకరించాలి.
* ఓటరు ఒకే నియోజకవర్గం పరిధిలోగానీ, వేరే నియోజకవర్గంలోకిగానీ ఒకచోట నుంచి ఇంకోచోటికి మారినప్పుడుగానీ ఓటర్ల జాబితాలో సవరణలు చేసుకోవాలనుకుంటే సంబంధిత వ్యక్తి నుంచి ఫాం-8 తీసుకోవాలి.
* ఫాం-6, ఫాం-8 కింద దరఖాస్తు చేసుకునేవారి నుంచి స్వచ్ఛందంగా ఆధార్ నంబరు తీసుకోవాలి. అయితే ఆ వివరాలు ఇవ్వడానికి ఓటరు అంగీకరించనంత మాత్రాన వారి పేర్లను జాబితాలో చేర్చడానికి తిరస్కరించొద్దు. అలాగే ఉన్న పేరూ తొలగించకూడదు.
* దరఖాస్తుదారులు ఇచ్చిన పుట్టిన తేదీల ఆధారంగా వాటిని అర్హత తేదీల ఆధారంగా వేరు చేయాలి.
* ప్రస్తుతానికి 1.1.2024 తేదీ నాటికి 18 ఏళ్లకు చేరుకునేవారి దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలి.
* ఫాం-7 ద్వారానే తొలగింపులు చేపట్టాలి. మరణాల విషయంలో తప్ప మిగిలిన ఏదైనా కారణంగా పేర్లు తొలగించేట్లయితే ఓటరుకు నోటీసులు జారీ చేయాలి. ఒకవేళ ఆ అడ్రస్లో ఓటరు లేకపోతే ఇద్దరు సాక్షుల ముందు ఆ నోటీసును సదరు ఇంటి తలుపుపై అతికించాలి. ఆ సాక్షుల సంతకాలు తీసుకుని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఫైల్లో భద్రపరచాలి. అలాగే సంబంధిత వ్యక్తి వాదనలూ వినాలి.
* మరణాల కారణంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేటప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంగానీ, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారి వాంగ్మూలంగానీ తీసుకోవచ్చు.
* మరణాలు మినహా మిగతా కారణాలవల్ల పేర్లు తొలగించేటప్పుడు ఫామ్-7పై తుది ఉత్తర్వులు జారీచేసే ముందు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు స్థాయి అధికారులు తనిఖీ చేయాలి. మొత్తం తొలగింపుల్లో కనీసం 10% మొత్తాన్ని అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలి.
* ఒక పోలింగ్ స్టేషన్లో తొలగింపులు మొత్తం ఓటర్లలో 2%కి మించి ఉంటే, ఒకే వ్యక్తి 5 కేసులకు మించి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతంగా పరిశీలించి ధ్రువీకరించుకోవాలి.
* మరణం కారణంగా తొలగించిన ఓటర్ల పేర్లు మినహాయిస్తే మిగిలిన తొలగింపులన్నింటినీ సూపర్వైజర్లు, ఏఈఆర్లు, ఈఆర్వోలు తనిఖీ చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి