మణిపుర్‌లో మళ్లీ ఘర్షణ

మణిపుర్‌లోని రెండు జిల్లాల్లో సోమవారం ఉదయం చెలరేగిన సాయుధ ముఠాల ఘర్షణలో ముగ్గురు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి.

Published : 06 Jun 2023 05:02 IST

ముగ్గురు మృతి...నలుగురికి గాయాలు

ఇంఫాల్‌: మణిపుర్‌లోని రెండు జిల్లాల్లో సోమవారం ఉదయం చెలరేగిన సాయుధ ముఠాల ఘర్షణలో ముగ్గురు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఇంఫాల్‌ వెస్ట్‌ డిస్ట్రిక్ట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. కాక్చింగ్‌ జిల్లాలోని ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గత రెండు రోజుల్లోనూ మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయుధ మూకలకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరిగినట్లు తెలిసింది. అనంతరం తీవ్రవాదులు వదిలిపెట్టి వెళ్లిన శిబిరాలకు స్థానిక ప్రజలు నిప్పటించారు.
.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని