రైళ్లే కాదు, జీవితాలూ పట్టాలు తప్పాయ్!
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామన్న ఆనందం కంటే.. ఇకపై కుటుంబాన్ని పోషించడమెలా అన్న ఆందోళనే వారిని ఎక్కువగా వెంటాడుతోంది.
కోలుకొనేదాకా ఇల్లు గడిచేదెలా?
మునుపటిలా పని చేయగలమా?
భవిష్యత్తుపై బాధితుల ఆందోళన
బాలేశ్వర్ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామన్న ఆనందం కంటే.. ఇకపై కుటుంబాన్ని పోషించడమెలా అన్న ఆందోళనే వారిని ఎక్కువగా వెంటాడుతోంది. కాళ్లు, చేతులు విరిగిపోయి, తలలు పగిలిపోయిన గాయాల బాధ కంటే.. తాము కోలుకుని తిరిగి మునుపటిలా పనిచేయటానికి వెళ్లేంత వరకూ ఇల్లు గడవడమెలా అనే ఆలోచనే వారిని అధికంగా భయపెడుతోంది. ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో గాయపడి బాలేశ్వర్, కటక్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి దయనీయ పరిస్థితి ఇది. బాధితుల్లో అత్యధికులది నిరుపేద నేపథ్యమే. రెండు రోజులు కూలి పని చేయకపోతే మూడు రోజు నుంచి మూడు వేళ్లూ నోట్లోకి వెళ్లని దుస్థితి. అలాంటిది ఇప్పుడు నెలలు తరబడి పని చేయలేకపోతే.. ఇల్లు గడిచేదెలాగని వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి పలకరించినప్పుడు వారి మాటల్లో బతుకు పట్ల, భవిష్యత్తు పట్ల భయమే వ్యక్తమైంది. ఈ ప్రమాదంలో రైళ్లే కాదు, తమ జీవితాలూ పట్టాలు తప్పిపోయాయని, వాటిని గాడిలో పెట్టడం ట్రాక్ను పునరుద్ధరించినంత సులభం కాదని బిహార్కు చెందిన ఓ బాధితుడు వాపోయారు.
కుటుంబానికి వారే జీవనాధారం
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఎక్కువ మంది ఆయా కుటుంబాలకు వారే జీవనాధారం. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వీరు చెన్నై, బెంగళూరు నగరాల్లో దినసరి కూలీలుగా, హోటళ్లలో, ప్రైవేటు సంస్థల్లో కార్మికులుగా, భవన నిర్మాణ శ్రామికులుగా, ఇతరత్రా చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఆ ఆదాయంతో తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని పోషించుకుంటున్నారు. వీరికి కాళ్లూచేతులూ విరిగిపోవటం, తలలు పగిలిపోవటంతో నాలుగైదు శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితి. వీరు కోలుకొని, గతంలో మాదిరిగా తిరగడానికి కనీసం ఆర్నెల్ల నుంచి ఏడాది పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతకాలం పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటే పూట గడిచేదెలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులకు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జి చేసిన తర్వాత కూడా తదుపరి వైద్యం, మందులకు చాలా ఖర్చవుతుంది. ఇంటి అవసరాలే తీర్చుకోలేరంటే.. వైద్యానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని వారు వాపోతున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమిచ్చే పరిహారం సరిపోదని చెబుతున్నారు.
ఇల్లు ఎలా నడుస్తుందనే భయమంతా!
28 ఏళ్ల గురు పలాయ్ది ఝార్ఖండ్. వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాపిల్లలను పోషించుకునేందుకు సొంతూరిలో ఓ వాహనానికి హెల్పర్గా పనిచేసేవారు. ఆ ఆదాయం చాలకపోవటంతో చెన్నైలో పేపర్ మిల్లులో పని చేసేందుకు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఓ కాలు పూర్తిగా విరిగిపోయింది. మరో కాలి మడమ నుజ్జునుజ్జయిపోవడంతో తొలగించారు. బాలేశ్వర్ ఆసుపత్రిలో మరో 15-20 రోజులు ఉండాల్సి ఉంటుంది. ‘నేను కోలుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. కోలుకున్నా మునుపటిలా బరువైన పనులు చేయలేను. ఈ లోగా నా తల్లిదండ్రులను, భార్యాపిల్లల్ని పోషించడమెలా అన్న భయం వెంటాడుతోంది. వాళ్లను చూస్తుంటే ఏడుపు ఆగట్లేదు’ అని గురు పలాయ్ కన్నీటిపర్యంతమయ్యారు.
కోలుకోవడానికి రెండు, మూడు నెలలు
-అజయ్కుమార్, ఒడిశా
నేను చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తా. నా ఆదాయమే కుటుంబానికి జీవనాధారం. ప్రమాదంలో చేతులు విరిగిపోయాయి. తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉన్నాను. పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లోకి చేరాలంటే కనీసం రెండు, మూడు నెలలు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈలోగా డ్యూటీకి వెళ్లలేను కాబట్టి జీతం రాదు. అప్పటివరకూ అప్పు చేసి గడపాల్సిందేనా?
ఇద్దరం మంచాన పడ్డాం
-సమస్ ఉద్దీన్, అస్సాం
నేను, నా భార్య సజనాబేగం ఇద్దరం బెంగళూరులోని ఓ హోటల్లో పనిచేస్తాం. పిల్లలిద్దరూ అస్సాంలో ఉంటారు. వారిని చూసేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం బారిన పడ్డాం. నాకు కాలు విరిగిపోయింది. నా భార్యకు చేతులు విరిగిపోయాయి. ఈ గాయాలు మాని, తిరిగి మేము పనికి వెళ్లాలంటే కనీసం ఆరేడు నెలలు పడుతుంది. మేమిద్దరం పని చేసుకుంటూ సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. అలాంటిది ఇద్దరం ఒకేసారి మంచాన పడ్డాం. మున్ముందు ఎలా గడపాలి, పిల్లల బతుకులెట్లా అన్నది అర్థం కావట్లేదు.
పరదాల ఆవల.. ప్రమాద ఆనవాళ్లు
రైళ్ల ప్రమాదం గుర్తులు, ఆనవాళ్లు, దెబ్బతిన్న బోగీలు కనిపించకుండా బహానగా వద్ద రైల్వే ట్రాక్కు ఇరువైపులా అధికారులు గ్రీన్మ్యాట్ పరదాలు కట్టారు. పూర్తిగా దెబ్బతిన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు ఆదివారం రాత్రికే పూర్తి కాగా, సోమవారం ఉదయం నుంచి ఈ మార్గంలో పలు రైళ్లు నడిచాయి. ప్రయాణికులకు ప్రమాద తీవ్రత కనిపించకుండా, ఆందోళన చెందకుండా ఇలా పరదాలు కట్టినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్