Odisha Train Accident: విద్యుత్తు షాక్తోనే 40 మంది మృతి
కోరమండల్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్తు షాక్ వల్లనే దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని బయటపడింది.
..అందుకే వారి దేహాలపై ఎలాంటి గాయాల్లేవు
కోరమాండల్ దుర్ఘటనలో వెలుగుచూసిన మరో కోణం
ప్రమాదంపై సీబీఐ కేసు.. దర్యాప్తు మొదలు
బాలేశ్వర్, భువనేశ్వర్/ కటక్-న్యూస్టుడే: కోరమండల్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్తు షాక్ వల్లనే దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని బయటపడింది. ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద ఈ నెల 2న జరిగిన దుర్ఘటనలో తెగిన తీగలు.. కొన్ని రైలుపెట్టెలకు తగలడంతో వాటిలో ఉన్నవారికి తీవ్రంగా షాక్ కొట్టిందని బాలేశ్వర్లోని ప్రభుత్వ రైల్వే పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ పేర్కొంది. విద్యుత్తు స్తంభాలు సయితం కుప్పకూలిపోవడంతో ఇలా జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మృతదేహాలకు వైద్యులు పరీక్షలు నిర్వహించినప్పుడు పలువురి శరీరాలపై బయటకు ఏ విధమైన గాయాలు కనిపించలేదు.
రంగంలోకి సీబీఐ
ఘోర రైలు ప్రమాదం వెనుక ఎవరిదో ఉద్దేశపూర్వక ప్రయత్నం, నేరపూరిత నిర్లక్ష్యం ఉన్నాయని అనుమానిస్తూ.. నిగ్గుతేల్చే బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ప్రభుత్వం అప్పగించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆ సంస్థ లాంఛనంగా కేసు నమోదు చేసుకుంది. ఎవరినైనా ప్రశ్నించడానికి, ఆధారాలు సేకరించడానికి ఇది తప్పనిసరి. జాయింట్ డైరెక్టర్ విప్లవ్కుమార్ చౌధరి నేతృత్వంలో ఆరుగురు అధికారుల బృందం బాలేశ్వర్లోని ప్రమాదస్థలికి చేరుకుంది. పలువురు సిబ్బంది నుంచి వివరాలు ఆరా తీసింది. రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను, ప్రమాద తీరును పరిశీలించింది. ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్లైన్కు ఖాయం చేసిన రూటును లూప్లైనుకు మార్చడం సాధ్యం కాదని రైల్వే అధికారి ఒకరు తేల్చిచెప్పారు. ఆదివారం రాత్రి నుంచి బహానగా బజార్ రైల్వేస్టేషన్ మీదుగా 70 రైళ్లు రాకపోకలు సాగించాయి.
తెలుగు రాష్ట్రాలకూ సమాచారం
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో పలువురిని ఇప్పటివరకు గుర్తించలేకపోవడంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాలకు సమాచారం పంపించామని ఖుర్దారోడ్ డీఆర్ఎం రింకేశ్ రాయ్ తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన వారెవరైనా గల్లంతయ్యారేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
డీఎన్ఏ నమూనాల సేకరణ
మరోవైపు- డీఎన్ఏ నమూనాల సేకరణను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. కుటుంబ సభ్యుల నుంచి వీటిని తీసుకుని, మృతుల డీఎన్ఏతో సరిపోల్చే పనిని భువనేశ్వర్ ఎయిమ్స్ చేపట్టింది. ఉపేంద్రకుమార్ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పచ్చబొట్టు ఆధారంగా సోమవారం గుర్తించినా దానిని మంగళవారం వేరేవారికి అప్పగించారనీ, ఇక డీఎన్ఏ పరీక్షలు చేసి ఉపయోగం ఏమిటని ఝార్ఖండ్ వాసి ఒకరు ప్రశ్నించారు. అవసరమైతే ఆరు నెలల వరకు భద్రపరిచేందుకు వీలుగా మృతదేహాలను ఐదు శీతలీకృత కంటైనర్లలోకి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మృతుల సంఖ్య 288: ఒడిశా సీఎస్
ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి పెరిగిందని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రదీప్ కుమార్ జెనా భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. ఇంతవరకు 205 మృతదేహాల గుర్తింపు పూర్తయిందనీ, మిగిలినవారి వివరాలు తెలియలేదని చెప్పారు. భువనేశ్వర్కు 193, బాలేశ్వర్కు 94, భద్రక్కు ఒక మృతదేహాన్ని తరలించారని.. బాలేశ్వర్, భద్రక్లలో అప్పగింత ప్రక్రియ పూర్తయిందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు