వరికి రూ.143 పెంపు
కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ మద్దతు ధరలను పెంచింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం రూ.89,047 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.
14 పంటల మద్దతు ధరలు పెంచిన కేంద్రం
బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.89,047 కోట్లు
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ మద్దతు ధరలను పెంచింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం రూ.89,047 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి 14 పంటలకు 5.3 శాతం నుంచి 10.35శాతం వరకూ కనీస మద్దతు ధరలు పెరిగాయి. రూ.128 (మొక్కజొన్నకు) నుంచి రూ.805 (నువ్వులకు) వరకూ ఈ పెంపుదల ఉంది. బుధవారం దిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం మద్దతు ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే వరికి కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.143 (7శాతం), పెసలకు రూ.803 పెరిగింది. గత ఖరీఫ్ సీజన్తో పోలిస్తే నువ్వులకు గత పదేళ్లలో వరికి అత్యధికంగా 2018-19లో రూ.200 పెరిగింది. దేశవ్యాప్తంగా పంట సాగుకయ్యే సగటు వ్యయంపై 50% అదనపు లాభం కల్పించాలన్న సూత్రం ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య, ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కేబినెట్ భేటీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కొత్త ధరల తర్వాత సాధారణ పరిస్థితుల్లో సగటు పెట్టుబడులమీద సజ్జపై 82%, కందిపై 58%, సోయాబిన్పై 52%, మినుముపై 51% లాభాలు రైతులకు వస్తాయని చెప్పారు. మిగిలిన అన్ని పంటలపై 50% లాభం రానుందని వెల్లడించారు. 2022-23 మూడో ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 330.5 మిలియన్ టన్నులకు చేరనుందని, 2021-22తో పోలిస్తే ఇది 14.9 మిలియన్ టన్నులు అధికమని పేర్కొన్నారు. గత అయిదేళ్లలో ఇది అత్యధిక పెరుగుదలని చెప్పారు.
గురుగ్రామ్లో మెట్రో మార్గానికి ఆమోదం
దేశ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే దిల్లీ సరిహద్దు నగరం గురుగ్రామ్లో హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ వరకు 28.50 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 స్టేషన్లతో ఈ మార్గంలో ఎలివేటెడ్ మెట్రోను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5,452 కోట్లు.
రైతుల కోసం తీసుకునే ఎన్నో నిర్ణయాల్లో మద్దతు ధర ఒకటి: ప్రధాని
దిల్లీ: గత తొమ్మిదేళ్లుగా రైతుల ప్రయోజనాల కోసం తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాల్లో ఈ ఖరీఫ్కు పంటల మద్దతు ధర పెంచడం ఒకటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీనివల్ల తమ పంట ఉత్పత్తులకు రైతులు సరైన ధరలు పొంది మరింత బలోపేతమవుతారని పేర్కొన్నారు. పంటలకు మద్దతు ధర పెంచుతూ బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM