సంక్షిప్త వార్తలు
విదేశాల్లో న్యాయ పట్టభద్రులైన భారతీయులు మన దేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు అనుమతించే అర్హత పరీక్ష ఫలితాలను వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది.
విదేశీ న్యాయ పట్టభద్రుల అర్హత పరీక్ష ఫలితాల వెల్లడి కోరుతూ పిటిషన్
శుక్రవారం విచారణ జరిపేందుకు ధర్మాసనం అనుమతి
దిల్లీ: విదేశాల్లో న్యాయ పట్టభద్రులైన భారతీయులు మన దేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు అనుమతించే అర్హత పరీక్ష ఫలితాలను వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ఈ కేసును శుక్రవారం విచారణ జాబితాలో చేర్చాలని జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ రాజేశ్ బిందల్ ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఈ పరీక్షను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిర్వహించింది. ఈ నెలలో ఫలితాలను ప్రకటించకపోతే 75 మందికి పైగా అభ్యర్థులు ఆలిండియా బార్ కౌన్సిల్ మరో మూడు నెలల్లో నిర్వహించే పరీక్షకు అర్హతను పొందలేరని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. సత్వరమే ఫలితాలు వెల్లడించేలా బీసీఐని ఆదేశించాలని అభ్యర్థించారు.
జులై 10 వరకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్పై ముందుకు వెళ్లం
బాంబే హైకోర్టుకు తెలిపిన కేంద్రం
ముంబయి: సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు నిజ నిర్ధారణ విభాగం(ఫ్యాక్ట్ చెక్ యూనిట్) ఏర్పాటు నిర్ణయంపై జులై 10వరకు ముందుకు వెళ్లలేమని కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. అంతకుముందు జులై 5 వరకు దీనిని ఏర్పాటు చేయమని చెప్పిన కేంద్రం.. ఆ గడువును కాస్త పొడిగించింది. సవరించిన ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాలు చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ బాంబే హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారి హక్కులను కాపాడటంతోపాటు వినియోగదారులకు నిర్ధారిత సమాచారాన్ని అందించడం తమ బాధ్యత అని కేంద్రం న్యాయస్థానానికి వివరించింది. ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ ఎడిటర్స్ గిల్డ్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజీన్స్ కూడా వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశాయి. వీటిపై జులై 6 నుంచి విచారణ చేపడతామని పేర్కొంది. జులై 7లోపు పిటిషినర్లు తమ వాదనలు పూర్తిచేయాలని.. అనంతరం కేంద్ర ప్రభుత్వ వాదన వింటామని తెలిపింది.
‘మోదీ డిగ్రీ’ కేసులో కేజ్రీవాల్కు సమన్లు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీపై చేసిన వ్యాఖ్యల కేసులో జులై 13వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్లను గుజరాత్లోని అహ్మదాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జయేశ్ ఛోవాతియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి బుధవారమే వారిద్దరూ హాజరు కావాల్సి ఉంది. వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై మినహాయింపు కోరారు. కోర్టు పత్రాలను ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి ఆ పత్రాలను ఇవ్వాలని ఆదేశిస్తూ జులై 13న వారిద్దరూ హాజరుకావాలని ఆదేశించారు.
రైతు నేతల అరెస్టు
కురుక్షేత్ర: కనీస మద్దతు ధరకు పొద్దు తిరుగుడు విత్తనాలను కొనుగోలు చేయాలని కోరుతూ మంగళవారం హరియాణాలోని షాబాద్వద్ద జాతీయ రహదారిని టిల్లర్లతో దిగ్బంధించిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ-చడూనీ) నేతలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ సంఘం అధినేత గుర్నాం సింగ్ చడూనీసహా 9 మంది నేతలను కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో వారి విడుదల కోరుతూ బీకేయూ కార్యకర్తలు బుధవారం మళ్లీ ధర్నాలు చేశారు.
మోదీ చొరవతో యువతకు సాధికారత
ప్రధాని మోదీ స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాలతో ఆవిష్కరణలు, సంస్థల ఏర్పాటు దిశగా ప్రోత్సాహం అందించడం ద్వారా 9 ఏళ్ల పాలనలో యువతకు సాధికారత కల్పించారు. ఆయన చొరవ కారణంగా దేశంలో వందకు పైగా యూనికార్న్ సంస్థలు వెలిసి లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.
అమిత్ షా
మణిపుర్కు మోదీ ఎందుకు వెళ్లడం లేదు?
మణిపుర్లో హింస ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. అయినా ప్రధాని మోదీ ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ రాష్ట్రాన్ని సందర్శించి సయోధ్య కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు? కనీసం ఆ రాష్ట్రంలో పర్యటించే దిశగా అఖిలపక్ష బృందాన్ని ఆయన ఎందుకు ప్రోత్సహించడం లేదు?
జైరాం రమేశ్
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ మోసం
కర్ణాటకలో అందరికీ, ప్రతి ఇంటికీ ఉచితాలను గ్యారెంటీగా అందిస్తామంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కానీ తాము ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యం అని ఆ పార్టీ ఇప్పుడు గ్రహించింది. అందుకే పథకాల అమలుకు లెక్కకు మించి నిబంధనలు పెడుతూ ప్రజలను మోసగిస్తోంది.
తేజస్వీ సూర్య
ఆన్లైన్లో విద్వేషానికి చోటివ్వద్దు
ఆన్లైన్ ప్రపంచంలోని విద్వేష ప్రసంగాలు నిజ జీవితంలోనూ హాని కలిగిస్తాయి. మీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో వాటికి చోటివ్వకండి. ఏదైనా సమాచారం పంచుకొనే ముందు వాస్తవాలను నిర్ధారించుకోండి. సహనం, సమానత్వ భావనను పెంపొందించే సందేశాలను పంచుకోవడం ద్వారా విద్వేషాన్ని ఎదుర్కోండి. విద్వేషానికి గురవుతున్న బాధితులకు అండగా నిలవండి.
ఐరాస
జేఎన్యూలో విద్యార్థినుల అపహరణకు విఫలయత్నం
పోలీసుల అదుపులో ఓ వ్యక్తి
దిల్లీ: దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థినులను అపహరించే ప్రయత్నం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి వర్సిటీ ఆవరణలోకి కారులో వచ్చిన మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఇద్దరు విద్యార్థినులను అపహరించేందుకు యత్నించారని జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ఆరోపించింది. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి శారీరక వేధింపులకు సంబంధించి, మరొకటి అపహరణకు సంబంధించి ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో నిందితులు, వాహనం ఒకటేనని పోలీసు అధికారి వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఓ వ్యక్తిని అభిషేక్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
దేశంలో భాజపా వ్యతిరేక పవనాలు
ఇదే కొనసాగితే 2024 ఎన్నికల్లో మార్పు తథ్యం: శరద్ పవార్
ఔరంగాబాద్: దేశంలో ప్రస్తుతం భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాలను బట్టి చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మార్పు తథ్యమని వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్లో బుధవారం ఆయన విలేకర్లతో ఈ మేరకు మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్న తెలంగాణ మోడల్(రైతులకు ఆర్థిక సాయం)పై ఆయన స్పందిస్తూ.. ‘‘తెలంగాణ మోడల్ను పరిశీలించాలి. తెలంగాణ చిన్న రాష్ట్రం కాబట్టి అక్కడ అలాంటి సాయం ప్రకటించవచ్చు. వ్యవసాయానికి సంబంధించి మౌలిక సదుపాయాలపై ఎక్కువ నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంలో మీరు అభిమానించే మంత్రి ఎవరన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు. ‘‘నితిన్ గడ్కరీ తన పార్టీని దృష్టిలో పెట్టుకుని పనులు చేయరు. మనం ఏదైనా అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే.. అది ఎంత ముఖ్యమైనది అని ఆలోచిస్తారు తప్ప.. ఎవరు చెప్పారు అన్నది చూడరు’’ అని పవార్ కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం