Odisha Train Accident: టీవీ దృశ్యాలతో కుమారుడిని గుర్తించిన నేపాల్ జంట
ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన రామానంద పాసవాన్ (15) అనే బాలుడు, నేపాల్ నుంచి ఆ అబ్బాయి ఆచూకీ కోసం పరుగున తరలివచ్చిన తల్లిదండ్రులు ఓ టీవీ ఛానెల్ దృశ్యాల ఆధారంగా పరస్పరం కలుసుకోగలిగారు.
కటక్: ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటనలో గాయపడిన రామానంద పాసవాన్ (15) అనే బాలుడు, నేపాల్ నుంచి ఆ అబ్బాయి ఆచూకీ కోసం పరుగున తరలివచ్చిన తల్లిదండ్రులు ఓ టీవీ ఛానెల్ దృశ్యాల ఆధారంగా పరస్పరం కలుసుకోగలిగారు. తనయుడి కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఆ జంటను ఓ టీవీ ఛానల్ విలేకరి గుర్తించి ప్రత్యక్ష ప్రసారంలో వారి కష్టాలను చూపించారు. వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు తన గదిలో అదే సమయంలో ఆ టీవీ ఛానల్ చూస్తూ వెంటనే అక్కడి వైద్యవర్గాలను అప్రమత్తం చేశాడు. వారు టీవీ ఛానల్ వర్గాలతో మాట్లాడి, తల్లిదండ్రులను, వారి అబ్బాయిని ఒక్కటి చేశారు. కోరమండల్లో ప్రయాణించిన ముగ్గురు బంధువులు ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని, తమ కుమారుడొక్కడు అదృష్టవశాత్తూ బయటపడ్డాడని రామానంద తండ్రి హరి పాసవాన్ తెలిపారు.
సిగ్నల్ లోపం కాదంటున్న అధికారి
సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని రైల్వేశాఖ ‘సంయుక్త దర్యాప్తు నివేదిక’ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ బృందంలో ఒకరైన సిగ్నల్-టెలికమ్యూనికేషన్స్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఏకే మహంత మాత్రం మిగిలిన నలుగురి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ‘‘17-ఏ పాయింటు రివర్స్ కండిషన్లో సెట్చేసి ఉందంటే నేను అంగీకరించను. డేటాలాగర్ ప్రకారం ఈ పాయింట్ ‘నార్మల్’లోనే ఉందని మా విభాగం పరిశీలనలో తేలింది. రైలు పట్టాలు తప్పిన తర్వాత ఈ పాయింట్ ‘రివర్స్’లోకి మారిపోయి ఉంటుంది’ అని మహంత నివేదికలో అభిప్రాయపడ్డారు.
‘చావు’ తెలివి చూపిన భార్యపై భర్త ఫిర్యాదు
ఘోర రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని చెప్పి పరిహారం పొందేందుకు అతి తెలివి ప్రదర్శించిన మహిళ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కటక్కు చెందిన గీతాంజలి దత్తా అనే మహిళ.. దుర్ఘటనలో చనిపోయిన వ్యక్తుల ఫొటోలు ఉంచిన ప్రదేశంలో ఓ వ్యక్తి ఫొటో చూపిస్తూ అతడే తన భర్త అని చెప్పింది. పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా పరిహారం కోసం ఇలా వ్యవహరించినట్లు అంగీకరించడంతో హెచ్చరించి విడిచిపెట్టారు. గీతాంజలి తీరు ఆమె భర్త బిజయ్ దత్తాకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఆమెపై మానియాబందా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
బ్రిటన్ పార్లమెంటు నివాళి
మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లడంపై బ్రిటన్ పార్లమెంటు సంతాపం వ్యక్తంచేసింది. భారత సంతతికి చెందిన విపక్ష నేత వీరేంద్రశర్మ ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ స్పందించి, మృతులకు నివాళులర్పించింది. ఒడిశా ప్రభుత్వానికి, కేంద్ర సర్కారుకు సంతాప సందేశాలు పంపించింది. రైల్వేసిబ్బంది, అత్యవసర సేవల విభాగాలు, స్థానికులు అందించిన సేవల్ని కొనియాడింది.
నిజాలు వెలుగుచూడకుండా ప్రభుత్వ యత్నం: మమత
కోరమండల్ రైలు ప్రమాదం వెనుక నిజాలు వెలుగుచూడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి ఘటనలో జరిగినట్లే ఇక్కడా కొన్ని ఆధారాలను ఇప్పటికే మాయం చేశారని చెప్పారు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద దుర్ఘటనగా నిలిచిన ఈ ప్రమాదంలో వాస్తవాలను తెలుసుకోవాలని మృతుల కుటుంబాలవారు భావిస్తుంటే దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. బాలేశ్వర్ ప్రమాదంలో చనిపోయిన బెంగాలీ ప్రయాణికుల కుటుంబాలకు చెక్కులు, ఉద్యోగ నియామకపత్రాలు అందించేందుకు బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రమాద కారకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని, మంత్రిపై కేసు పెట్టాలి: కాంగ్రెస్
బాలేశ్వర్ రైలు ప్రమాద దుర్ఘటనలో కేంద్రం నిర్లక్ష్యం హిమాలయాలంత ఎత్తున కనిపిస్తోందనీ, దీనికిగానూ ప్రధాని నరేంద్రమోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్లపై సీబీఐ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రమాద స్థలంలో రైల్వేమంత్రి నాటకీయంగా వ్యవహరించారని, దానికిగానూ ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజోయ్కుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో వ్యంగ్యంగా అన్నారు. ప్రమాదానికి కారకులెవరో తేల్చినప్పుడే మృతుల కుటుంబాలకు న్యాయం జరిగినట్లవుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు