ఆగని రైలు ప్రమాద ఘంటికలు
వేర్వేరు రైల్వేజోన్ల పరిధిలో రైలుప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. అస్సాం, మధ్యప్రదేశ్లలో గూడ్సురైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురయ్యాయి.
ఝార్ఖండ్లో రాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
అస్సాం, మధ్యప్రదేశ్లలో పట్టాలు తప్పిన గూడ్సురైళ్లు
గువాహటి, జబల్పుర్, రాంచీ: వేర్వేరు రైల్వేజోన్ల పరిధిలో రైలుప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. అస్సాం, మధ్యప్రదేశ్లలో గూడ్సురైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురయ్యాయి. అస్సాంలోని కామ్రూప్ జిల్లాలో సింగ్రా వద్ద బొగ్గుతో వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన 20 వ్యాగన్లు బుధవారం పట్టాలు తప్పాయి. మొత్తం 60 వ్యాగన్లు ఈ రైల్లో ఉన్నాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఆ మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్లు యథావిధిగా నడిచినా కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. మధ్యప్రదేశ్లోని జబల్పుర్ రైల్వే డివిజన్ పరిధిలో ఒక గూడ్సురైలుకు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకర్లు మంగళవారం రాత్రి పట్టాలు తప్పాయి. భిటోనీ రైల్వేస్టేషన్ సమీపంలో చమురు డిపో సైడింగ్ లైన్లో గూడ్సు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. దెబ్బతిన్న మార్గాన్ని బుధవారం పునరుద్ధరించారు. ప్రధాన మార్గంలో రైళ్లకు ఎలాంటి అంతరాయం వాటిల్లలేదు.
పట్టాల వద్దకు దూసుకొచ్చిన ట్రాక్టరు
ఝార్ఖండ్లో రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. కొత్తదిల్లీ నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న రైలు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఝార్ఖండ్లోని బొకారో జిల్లా భోజూడీహ్ రైల్వేస్టేషన్ వద్ద లెవెల్క్రాసింగ్ గేటును దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసుకుంటున్న రైల్వేగేటును ఢీకొడుతూ ఈ ట్రాక్టరు ఆ గేటుకు పట్టాలకు మధ్య ఆగిపోయింది. అతి సమీపం నుంచి దీనిని గమనించిన రైలు డ్రైవరు (లోకోపైలట్) సకాలంలో ఆకస్మిక బ్రేకు వేసి రైలును నిలిపేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆగ్నేయ రైల్వేలోని ఆడ్రా డివిజనల్ రైల్వే మేనేజర్ మనీశ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో రైలు ముప్పావుగంటసేపు ఆలస్యమైంది. ట్రాక్టరును స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవరుపై పోలీసు స్టేషన్లో కేసుపెట్టారు. గేట్మేన్ను సస్పెండ్ చేశారు. ఒడిశా రైలు దుర్ఘటన నేపథ్యంలో ఇటు ప్రయాణికులు, అటు రైల్వే అధికారులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు.
పాంటోగ్రాఫ్ విరగడంతో..
రైలుమార్గాల పైన ఉండే విద్యుత్తు తీగల నుంచి విద్యుత్తును రైలింజన్కు అందించే పాంటోగ్రాఫ్ విరిగిపోవడంతో హోవ్డా-ధన్బాద్ కోల్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ బుధవారం సాయంత్రం పశ్చిమబెంగాల్లో నిలిచిపోయింది. దీనికి మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరా జరిగే ఏర్పాట్లు పూర్తయ్యేసరికి గంటన్నర సమయం పట్టింది. ఈలోగా రైళ్లను ఇతర మార్గాల్లో పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..