సంక్షిప్త వార్తలు (8)
అమర్నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం జరిగేలా చూడాలన్నదే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యమని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు.
అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై అమిత్షా సమీక్ష
దిల్లీ: అమర్నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనం జరిగేలా చూడాలన్నదే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యమని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో యాత్ర కొనసాగే మార్గంలో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జులై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 62 రోజులపాటు ఈ వార్షిక యాత్ర కొనసాగుతుంది. ఈ సమీక్షలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ ఉత్తర కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా తదితరులు పాల్గొన్నారు. యాత్రికులందరికీ ఆర్ఎఫ్ఐడీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తద్వారా వారు ఎక్కడున్నారో సులువుగా కనుక్కోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఒక్కో యాత్రికుడికి రూ.5లక్షల చొప్పున, యాత్రికులను మోసుకెళ్లే ఒక్కో జంతువుకు రూ.50వేల చొప్పున బీమా సౌకర్యం కల్పించనున్నారు. యాత్రికుల సౌకర్యార్థం శ్రీనగర్, జమ్మూల నుంచి రాత్రి వేళల్లో గగన ప్రయాణ సేవలు అందుబాటులో ఉంచాలని, తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, అంబులెన్సులు, హెలికాప్టర్ల ఏర్పాటుతో పాటు అదనపు వైద్య సిబ్బందిని నియమించాలని షా ఆదేశించారు. ఆన్లైన్లో శివలింగ దర్శనం, అమర్నాథ్ గుహలో ఉదయం, సాయంత్రం నిర్వహించే పూజల ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కృత్రిమ మేధను నియంత్రిస్తాం
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
దిల్లీ: దేశంలో డిజిటల్ వినియోగదారులకు ఎలాంటి హాని కలిగించకుండా ఉండేలా కృత్రిమ మేధ (ఏఐ)ను నియంత్రిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సైబర్ నేరాలకు ముకుతాడు వేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దిల్లీలో శుక్రవారం భాజపా ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా 85 కోట్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. ఇదే సమయంలో అంతర్జాలంలో విద్వేష ఘటనలు, నేరాలు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు హాని కలగకుండా మరిన్ని చర్యలు తీసుకుంటాం. కృత్రిమ మేధను నియంత్రిస్తాం’’ అని పేర్కొన్నారు.
జల్ జీవన్ మిషన్తో 4 లక్షల మరణాలను అడ్డుకోవచ్చు
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
దిల్లీ: అన్ని గ్రామీణ కుటుంబాలకు సురక్షిత తాగు నీరు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ పథకం పూర్తయితే అతిసారం వల్ల కలిగే 4 లక్షల మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కగట్టింది. ఇంతవరకు 62% గ్రామీణ కుటుంబాలకు కొళాయిల ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్లో 100 శాతం పల్లె కుటుంబాలకు మంచి నీరు అందిస్తే పారిశుద్ధ్యానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందని డబ్ల్యూహెచ్వో వివరించింది. అతిసార మరణాలను జల్ జీవన్ మిషన్తో నివారించడం ద్వారా 10,100 కోట్ల డాలర్లు ఆదా అవుతాయని లెక్కగట్టింది.
బీసీఐ గుర్తించిన కళాశాలలో చదివితేనే న్యాయవాదిగా నమోదు: సుప్రీంకోర్టు
దిల్లీ: న్యాయవాదిగా నమోదు కావాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తించిన కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించడం తప్పనిసరని శుక్రవారం సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీఐ రూపొందించిన నిబంధన చెల్లుబాటు అవుతుందని పేర్కొంటూ ఒడిశా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. హైకోర్టు తన తీర్పులో న్యాయవాదిగా నమోదు కావాలంటే అడ్వకేట్స్ యాక్ట్ (1961)లోని సెక్షన్ 24నే అనుసరించాలని, బీసీఐకి ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించే అధికారాలు లేవని పేర్కొంది.
మీడియా సిబ్బందికి యోగా అవార్డుల పునరుద్ధరణ
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడి
దిల్లీ: యోగాపై అవగాహన కల్పించడంలో మీడియా సిబ్బంది కృషికి గుర్తింపుగా ఇచ్చే అవార్డులను పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తమ మంత్రిత్వశాఖ మొత్తం 33 ‘అంతర్రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్’ పురస్కారాలు ఇవ్వనుందని, వీటిలో 11 ప్రింట్ మీడియాకు, 11 టెలివిజన్ మీడియాకు, 11 రేడియో విభాగానికి ఇస్తామని చెప్పారు. ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా జూన్ 2019లో ప్రకటించింది. అనంతరం జనవరి 7, 2020న పురస్కారాలను అందజేసింది. ఆ తర్వాత కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సస్పెండ్ చేసింది. ఈ ఏడాదికి సంబంధించి మీడియా సంస్థలు.. జూన్ 10, 2023 నుంచి జూన్ 25, 2023 మధ్య ప్రచురించిన కథనాలు, లేదా ప్రసారం చేసిన ఆడియో లేదా వీడియో కంటెంట్తోపాటు నిర్ణీత విధానంలో దరఖాస్తును పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు 1 జులై, 2023ను చివరి తేదీగా నిర్ణయించారు. 2015 నుంచి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే.
గుజరాత్ హైకోర్టులో కేజ్రీవాల్ సమీక్ష పిటిషన్
ప్రధాని మోదీ డిగ్రీ వివరాలు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో లేవని వెల్లడి
అహ్మదాబాద్: ప్రధాని మోదీ డిగ్రీ వివరాలను అందజేయాలన్న కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఉత్తర్వులను నిలిపివేస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదే న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. సీఐసీ తీర్పు ప్రకారం గుజరాత్ విశ్వవిద్యాలయం మోదీ డిగ్రీ వివరాలను కేజ్రీవాల్కు అందజేయాల్సి ఉంది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ గుజరాత్ విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించింది. మోదీ డిగ్రీ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయంటూ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో మార్చి నెలలో సీఐసీ ఆదేశాలను నిలిపివేయడంతో పాటు కేజ్రీవాల్కు రూ.25వేల జరిమానాను హైకోర్టు విధించింది. గుజరాత్ విశ్వవిద్యాలయం చెప్పినట్లుగా ఆ డిగ్రీ వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో లభించడం లేదని కేజ్రీవాల్ తన రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ బీరెన్ వైష్ణవ్ కేసును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయానికి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులుకు నోటీసులు జారీ చేశారు.
పాఠ్య పుస్తకాల్లో సవరణలు అహేతుకం
వాటిలో మా ఇద్దరి పేర్లు తొలగించండి
ఎన్సీఈఆర్టీకి పూర్వపు పాఠ్య పుస్తకాల ప్రధాన సలహాదారుల లేఖ
దిల్లీ: హేతుబద్ధీకరణ పేరిట ఏకపక్షంగా, అహేతుకంగా పాఠ్యపుస్తకాల్లో సవరణలు చేపట్టారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుహాస్ పాల్షికర్, యోగేంద్ర యాదవ్లు ఎన్సీఈఆర్టీకి లేఖ రాశారు. వీరిద్దరూ 2005లో ప్రచురితమైన 9 నుంచి 12 తరగతుల పొలిటికల్ సైన్స్ పుస్తకాలకు ప్రధాన సలహాదారులు. ప్రస్తుతం చేపట్టిన హేతుబద్ధీకరణ ప్రక్రియ పాఠ్యపుస్తకాల స్వరూపాన్ని దెబ్బతీసిందని, వాటిని విద్యాపరంగా నిరర్థకంగా మార్చారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో ప్రధాన సలహాదారులుగా ఉన్న తమ పేర్లను తొలగించాలని కోరుతూ వారు ఎన్సీఈఆర్టీకి లేఖ రాశారు. ‘సవరణలు సమర్థించుకుంటున్నప్పటికీ.. వాటిలో బోధనాపరమైన హేతుబద్ధీకరణ చూడలేకపోయాం. పాఠాలు గుర్తించలేని విధంగా ముక్కలు చేశారు. లెక్కలేనన్ని కోతలు, తొలగింపులు ఉన్నాయి. భర్తీ చేయకుండా ఖాళీలను వదిలేశారు. ఈ మార్పుల గురించి మమ్మల్ని ఎవ్వరూ సంప్రదించలేదు. తొలగింపులను మేము వ్యతిరేకిస్తున్నాం’ అని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి రాసిన లేఖలో వారిద్దరూ పేర్కొన్నారు.
ప్రగల్భాలు కాదు.. వ్యూహాలు కావాలి
వాస్తవాధీన రేఖతోపాటు ఇప్పుడు ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలోనూ చైనా సైనిక నిర్మాణాలు చేపడుతోంది. డ్రాగన్ చర్యలతో మన ప్రాదేశిక సమగ్రత దెబ్బతింటోంది. ప్రధాని మోదీ చైనాకు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది. చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి తప్ప బూటకపు ప్రగల్భాలతో ప్రయోజనం లేదు.
మల్లికార్జున ఖర్గే
దేశంలో పాల సంక్షోభం
భారత్ పాల సంక్షోభం ముంగిట ఉంది. అధిక ద్రవ్యోల్బణం, పశుగ్రాసం ధరల పెరుగుదలతో పాడి రైతులు సతమతమవుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అయిన మన దేశం ఇప్పుడు విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
జైరాం రమేశ్
సిద్దూ దయతోనే మాన్కు సీఎం పదవి
పంజాబ్కు నవజోత్ సింగ్ సిద్దూ సారథ్యం వహించాలని కేజ్రీవాల్ కోరుకున్నారు. ఎన్నికలకు ముందు సిద్దూను ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్కు ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో సిద్దూ ఆప్లో చేరలేదు. ఆయన దయ వల్లే భగవంత్ మాన్కు పంజాబ్ సీఎం పదవి దక్కింది.
నవజోత్ కౌర్, సిద్దూ సతీమణి
విజేతల అలవాట్లు ఇవీ..
నేను గమనించిన కొందరు విజేతల అలవాట్లు ఇవీ.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించుకుంటారు. కొత్త ఆలోచనలు వినడానికి ఆసక్తి చూపుతారు. ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. పుస్తకాలు విస్తృతంగా చదువుతారు. ఖర్చులు ఆదాయం కన్నా తక్కువ ఉండేలా జాగ్రత్త పడతారు. పొదుపు సొమ్మును మదుపు చేస్తారు.
హర్ష్ గోయెంకా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. -
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్ను విడుదల చేసింది. UPSC 2025 Calendar -
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
India-US: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అది పూర్తి పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. -
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. -
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM