సంక్షిప్త వార్తలు (8)
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరుకాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ చేయించనుంది.
దీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లకు రిటైర్మెంట్..
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరుకాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ చేయించనుంది. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం నుంచి పాఠశాలలకు రాకుండా విధుల నుంచి తప్పించుకుంటున్న ఉపాధ్యాయుల జాబితాను తయారుచేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి వారు దాదాపు 150 మంది ఉన్నారని, వారందరితో పదవీ విరమణ చేయించాలని సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేట్ కోర్సులకు ఇక ఉమ్మడి కౌన్సెలింగ్!
దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేవారికి ఇకపై ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. నీట్-యూజీ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ కౌన్సెలింగ్ జరగాలని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 2న గెజిట్ విడుదల చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఎన్ఎంసీ జారీ చేసిన సీట్ల వివరాల జాబితా ఆధారంగానే జరగాలని, అవసరమైతే పలు దశల్లో సీట్ల భర్తీ చేపట్టవచ్చని సూచించింది. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమిస్తుందని ఎన్ఎంసీ పేర్కొంది.
కేంద్ర ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా నేడు ఆప్ మహార్యాలీ
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పరిపాలన అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆదివారం మహార్యాలీని చేపడుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఆదివారం రాంలీలా మైదానంలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమంలో లక్ష మంది ప్రజలు పాల్గొంటారని పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
నేటి నుంచి ఆర్ఎస్ఎస్ గర్భ సంస్కార్
దిల్లీ: గర్భిణులు భగవద్గీత, రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పారాయణ చేస్తూ, సంస్కృత మంత్రాలను జపిస్తూ, యోగాభ్యాసాలు చేస్తే ఉన్నత సాంస్కృతిక విలువలు కలిగిన దేశభక్తులైన సంతానం జన్మిస్తుందని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సంవర్థనీ న్యాస్ విశ్వసిస్తోంది. ఈ లక్ష్య సాధనకు ఆదివారం నుంచి గర్భ సంస్కార్ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. అందులో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. న్యాస్లో సభ్యులైన వైద్యులు దేశమంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించామని, ఒక్కో విభాగంలో 10 మంది వైద్యులు గర్భ సంస్కార్ కార్యక్రమాన్ని చేపడతారని న్యాస్ ప్రతినిధి వివరించారు. ఒక్కో వైద్యుడు మొదట తన ప్రాంతంలో 20 మంది గర్భిణులకు పవిత్ర గ్రంథ పారాయణ, మంత్రజపం, యోగాభ్యాసం నేర్పిస్తారు. క్రమంగా వారి సంఖ్యను పెంచుకుంటూ పోతారు.
రష్యా నుంచి వెనక్కి వచ్చిన విమానం
దిల్లీ: అమెరికా వెళ్తూ మార్గమధ్యంలో ఇంజిను వైఫల్యం కారణంగా రష్యాలోని మగదన్లో అత్యవసరంగా దిగిన ఎయిరిండియా విమానం శనివారం తిరిగి ముంబయికి చేరుకుంది. ఇంజినీర్లు మరమ్మతు చేశాక ఉదయం బయలుదేరిన విమానం సాయంత్రానికి ముంబయి వచ్చింది. ఇప్పటికే మరో విమానం పంపించి మగదన్లోని ప్రయాణికులను అమెరికా చేరవేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6న దిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరిన విమానం అత్యవసరంగా మగదన్లో దిగింది.
ధరలు స్థిరంగా ఉంటే.. ‘తగ్గింపు’ను కంపెనీలు పరిశీలిస్తాయి
పెట్రో ధరలపై హర్దీప్సింగ్ పురి వెల్లడి
దిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరంగా ఉండి, వచ్చే త్రైమాసికంలోనూ చమురు సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటే.. అప్పుడు ఆ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే స్థితిలో ఉంటాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రకటన చేసే స్థితిలో తాను లేనని స్పష్టంచేశారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో శనివారం హర్దీప్సింగ్ పురి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత త్రైమాసికంలో చమురు సంస్థలు పనితీరు ఫర్వాలేదన్నట్లుగా ఉందని చెప్పారు.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి మోదీ ఫోన్
ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిపై చర్చలు
దిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర సహకారంపై ప్రగతిని ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసా సమీక్షించారు. శనివారం మోదీ ఆయనకు ఫోన్ చేశారు. 12 చీతాలను ఇచ్చినందుకు రాంఫోసాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష పదవిని దక్షిణాఫ్రికా చేపట్టబోతోంది. దీనిపైనా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఆఫ్రికాలోని దేశాధినేతల శాంతి ప్రయత్నాలపై, ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే అంశంపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామని రాంఫోసా హామీ ఇచ్చారు. భారత్లో పర్యటనపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
ప్రజల ఆర్థిక స్థితి మెరుగైంది
దేశంలో మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి ఈ 9 ఏళ్లలో వేగంగా పెరిగింది. రూ.7లక్షల వరకూ పన్ను రాయితీ, జన్ ఔషధి ద్వారా చౌక ధరలకే ఔషధాలు, బీమా ప్రయోజనాలు, ఉడాన్ ద్వారా తక్కువ ధరకే విమాన ప్రయాణాలు తదితర సదుపాయాలతో ప్రధాని మోదీ వారికి ఆర్థికంగా అండగా నిలిచారు.
అమిత్ షా
భాజపా పాలన వీటికి గుర్తుండిపోతుంది
మోదీ సారథ్యంలో భాజపా పాలనలోని 2014-2023 కాలం ఈ విషయాలకు గుర్తుండిపోతుంది. 1.విద్వేష సంస్కృతి 2.నకిలీ వార్తలు, మోసం 3.మత రాజకీయాలు 4.నియంతృత్వం 5.రాజకీయ ఆర్భాటం 6.సమాచార వక్రీకరణ 7.వ్యవస్థాగత క్షీణత 8.అనుకూల మీడియా 9.ట్రోలింగ్ 10.అవినీతి
కపిల్ సిబల్
వంట కోసం హానికర ఇంధనాల వినియోగం
ప్రపంచ జనాభాలో 25 శాతం మంది వంట వండటానికి హానికర ఇంధనాలు ఉపయోగిస్తున్నారు. అంతర్గత ప్రదేశాల్లో వాయు కాలుష్యం వల్ల వాతావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడటంతోపాటు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది. దీనివల్ల ఏటా 30లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో, విశ్వసనీయమైన ఇంధనం అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం.
ఐరాస
జీవిత క్రీడను ఆస్వాదించండి
ఆటలో గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా వంద శాతం మనసు పెట్టి గట్టి సంకల్పంతో ఆడేవాళ్లు దాన్ని తప్పకుండా ఆస్వాదిస్తారు. అలాగే జీవితంలోనూ కష్టసుఖాల గురించి భయపడకుండా ప్రతి సవాలును స్వీకరించేవారు ఆనందోత్సాహాలతో ఉంటారు. జీవితమనే క్రీడలో వారే నిజమైన ఆటగాళ్లు.
జగ్గీ వాసుదేవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా