విద్రోహ చర్యగా కనిపిస్తోంది
ఒడిశా రైలు ప్రమాదానికి విద్రోహ చర్యే కారణం కావొచ్చని, అదీ తీవ్రవాదుల ప్రోద్బలంతో జరిగి ఉండవచ్చని సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తీవ్రవాదుల ప్రోద్బలంతో జరిగి ఉండొచ్చు
ప్రధానికి 270 మంది ప్రముఖుల లేఖ
ఈనాడు, దిల్లీ ఒడిశా రైలు ప్రమాదానికి విద్రోహ చర్యే కారణం కావొచ్చని, అదీ తీవ్రవాదుల ప్రోద్బలంతో జరిగి ఉండవచ్చని సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో తమకున్న అనుభవంతో ఈ అంచనాకొచ్చామని పేర్కొన్నారు. జాతీయ భద్రత, అభివృద్ధికి ముప్పుగా పరిణమిస్తున్న ఇటువంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ శనివారం ప్రధాని మోదీకి 270 మంది ప్రముఖులు లేఖ రాశారు. పట్టాల భద్రత కోసం దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల పొడవునా ఉన్న అక్రమణదారులను, చట్ట విరుద్ధ వలసదారులను వెంటనే ఖాళీ చేయించాలని వారు కోరారు. లేఖ రాసిన వారిలో పదవీ విరమణ చేసిన హైకోర్టుల న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, బ్యూరోక్రాట్లు, మాజీ సైనికాధికారులు, రా అధికారులు, ఆదాయ పన్ను చీఫ్ కమిషనర్లు ఉన్నారు. ‘ఒడిశాలోని బాలేశ్వర్ రైలు దుర్ఘటనను చూసి మేం తీవ్రంగా కలత చెందాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకూ మీడియాలో వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. రైలు పట్టాలు తప్పడం వెనుక ఉద్దేశపూర్వక మానవ జోక్యం ఉన్నట్లు అనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థల ఆజ్ఞలకు అనుగుణంగానే విద్రోహానికి పాల్పడినట్లు కనిపిస్తోంది. దేశం జీ-20 సదస్సును నిర్వహిస్తున్నప్పుడు, స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరిగినప్పుడు అంతర్జాతీయంగా పేరు పొందిన భారతీయ రైల్వేపట్ల ప్రజా విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయడానికి దారుణమైన ఘాతుకానికి ఒడిగట్టిన విద్రోహులను ప్రస్తుత దర్యాప్తులో సీబీఐ గుర్తిస్తుందని మేం నమ్ముతున్నాం. దేశ ప్రాదేశిక సమగ్రత, దేశ భద్రతకోసం మీరు తీసుకొనే చర్యలకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుంది’ అని లేఖలో ప్రముఖులు పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో గువాహటి హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీధర్ రావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, దినేశ్ కుమార్, మాజీ డీజీపీ ఉమేశ్ కుమార్, తెలంగాణ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వినోద్ కె.అగర్వాల్, ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి సి.ఉమామహేశ్వరరావు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM