ప్రతిభావంతులకు గగనవిహారం

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అరుదైన కానుక ఇచ్చింది. 89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పి ఆనందపరిచింది.

Published : 11 Jun 2023 04:50 IST

89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పిన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అరుదైన కానుక ఇచ్చింది. 89 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పి ఆనందపరిచింది. అనంతరం ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌.. విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు, రూ.1.5లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను బంగారు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను వెండి పతకాలతో సత్కరించారు. హెలికాప్టర్‌ ఎక్కే అవకాశాన్ని దక్కించుకున్నవారిలో కుమారి బైగా అనే బాలిక కూడా ఉంది. ఆమె వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదివి పదో తరగతిలో 88.16 శాతం మార్కులు సాధించింది. తన తల్లి వారి స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట కార్మికురాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని