నారీశక్తికి జై.. మహిళా బిల్లుకు లోక్సభ ఆమోదం
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బుధవారం లోక్సభ జైకొట్టింది.
వెంటనే అమల్లోకి తేవాలన్న సోనియా
ఓబీసీ మహిళలనూ చేర్చాలని ఆమె డిమాండ్
2029 తర్వాతే అమలు : అమిత్ షా
దిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బుధవారం లోక్సభ జైకొట్టింది. 8 గంటల చర్చ తర్వాత దాదాపుగా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఓటింగ్లో 454 మంది సభ్యులు మద్దతు తెలపగా ఇద్దరే వ్యతిరేకించారు. ఓటింగ్ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. లోక్సభలోపాటు అసెంబ్లీల్లో ఈ బిల్లువల్ల 33శాతం కోటా మహిళలకు దక్కుతుంది. అంతకుముందు బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. తొలుత ఉదయం బిల్లును ఆమోదించాల్సిందిగా కేంద్ర మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ సభను కోరారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్కు ముందే రిజర్వేషన్లను అమలు చేయనప్పుడు.. ‘ప్రత్యేక’ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని నిలదీశారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు అటు అధికారపక్ష ఎంపీలు దీటుగానే బదులిచ్చారు. చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బిల్లును వెంటనే అమల్లోకి తేవాలని ప్రతిపక్షాలన్నీ కోరగా.. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్ చేపడతామని, సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బిల్లుపై లోక్సభలో 27 మంది మహిళా సభ్యులు ప్రసంగించారు. మొత్తం 60 మంది మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతు పలికారు. ప్రస్తుతం సభలో 82 మంది మహిళా ఎంపీలున్నారు. బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఆ పార్టీ ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకించారు.
మహిళా బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపిన అన్ని పార్టీల ఎంపీలకు కృతజ్ఞతలు. నారీ శక్తి వందన్ అధినియమ్.. చరిత్రాత్మక బిల్లు. అది మహిళలకు మరింత సాధికారత ఇవ్వనుంది. దీంతోపాటు దేశ రాజకీయ ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుంది.
ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ సమర్థిస్తోంది. ఇది నాకు చాలా ఉద్వేగ భరిత క్షణం. ఈ బిల్లును తీసుకురావడంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరింది.
సోనియా గాంధీ
బిల్లులోని చిన్న చిన్న లోపాలను తరువాత సవరిస్తాం. 2024 ఎన్నికలు కాగానే జన గణన, డీలిమిటేషన్ ప్రక్రియను తదుపరి ప్రభుత్వం చేపడుతుంది. అవి పూర్తి కాగానే రిజర్వేషన్లను అమల్లోకి తెస్తాం.
అమిత్ షా
నారీ శక్తి వందన్ అధినియమ్-2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. బిల్లును త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్సభలో బుధవారం చర్చ జరిగింది. సోనియా గాంధీ చర్చను మొదలుపెట్టి ప్రసంగించారు. ‘స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని నా భర్త రాజీవ్ ఆనాడు బిల్లు తీసుకొచ్చారు. అది రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఆ తర్వాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్లును అమల్లోకి తీసుకురాగలిగింది. దాని ఫలితమే స్థానిక సంస్థల్లో ఇప్పటివరకూ దాదాపు 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించగలిగారు’ అని సోనియా వివరించారు. ‘మహిళా బిల్లును వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. చట్టం సమర్థ అమలుకు వెంటనే కులగణన చేపట్టాలి’ అని సోనియా గాంధీ కోరారు.
నేను మద్దతిస్తున్నా
-రాహుల్
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఓబీసీలకు కోటా లేకపోవడం అసంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనానికి మారినప్పుడు రాష్ట్రపతిని ఆహ్వానించాల్సిందన్నారు. కుల గణననూ చేపట్టాలని డిమాండు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలకు చెందిన ముగ్గురు అధికారులే ఉన్నారని తెలిపారు.
ఇంటికెళ్లి వంట చేసుకోమన్నారు
-సుప్రియా
చర్చ సందర్భంగా ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి భాజపా ఎంపీ నిశికాంత్ దూబే విమర్శలు గుప్పించారు. మహిళలను తక్కువ చేయాలని చూస్తున్న వారికి ‘ఇండియా’ కూటమి మద్దతు పలుకుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా స్పందించారు. ‘గతంలో మహారాష్ట్రలో భాజపాకు చెందిన ఓ నేత ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన ఓసారి నాతో మాట్లాడుతూ.. సూలేజీ మీరు ఇంటికెళ్లి వంట చేసుకోండి.. దేశ వ్యవహారాలు మేం చూసుకుంటామని అన్నారు. ఇది భాజపా ఆలోచనా విధానం. మహిళా చట్టసభ్యుల పట్ల భాజపా నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేసేవారు’ అని దుయ్యబట్టారు.
మాకు శాల్యూట్ అక్కర్లేదు
-కనిమొళి
‘ఇది కేవలం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లే కాదు.. అసమానతలు, పక్షపాత ధోరణిని తొలగించే బిల్లు. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి తెస్తామని బిల్లులో పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకెంతకాలం ఎదురు చూడాలి. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియమ్ అని పేరు పెట్టారు. మాకు శాల్యూట్ చేసి వందనాలు చేయనక్కర్లేదు. సమానంగా గౌరవిస్తే చాలు’ అని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ప్రస్తావిస్తూ.. ఆమె శక్తిమంతమైన మహిళ అని అంగీకరించడానికి తనకు ఎలాంటి సంకోచాల్లేవని తెలిపారు.
రెజ్లర్లను వేధించిన ఎంపీపై చర్యలేవీ
-కకోలి
‘ఎన్నికల ముందు ఈ బిల్లును తీసుకురావడం పూర్తిగా భాజపా గిమ్మిక్కే. నిజంగా వారికి మహిళలంటే గౌరవముంటే చేతల్లో చూపించాలి. ఆటల్లో బంగారు పతకాలతో విశ్వ వేదికపై దేశ ప్రతిష్ఠను పెంచిన క్రీడాకారిణులు తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కారు. అందుకు బాధ్యులైన వారు (భాజపా ఎంపీ బ్రిజ్భూషణ్ను ఉద్దేశిస్తూ) ఇక్కడే కూర్చున్నారు. మహిళా సాధికారతపై మీరు నిజంగా దృష్టి సారిస్తే.. ఆ ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలి ఘోష్ కేంద్రాన్ని ప్రశ్నించారు. బిల్లుకు మహిళా రిజర్వేషన్ల రీషెడ్యూలింగ్ బిల్లు అని పేరు పెట్టాలని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా సూచించారు.
ఎన్నికల గారడీ
-జేడీయూ
బిల్లుకు తాముకు మద్దతిస్తున్నామని, కానీ భాజపా బిల్లు ద్వారా ఎన్నికల గారడీ చేస్తోందని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ విమర్శించారు. ఇండియా బలంగా మారడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మహిళా బిల్లుకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్ పేర్కొన్నారు. బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నామని శివసేన (శిందే) ఎంపీ భావనా గవాలి తెలిపారు. మంత్రివర్గాల్లోనూ 33శాతం కోటా ఉండాలని కోరారు. బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఇది అగ్రవర్ణ మహిళలకే ప్రయోజనకరంగా ఉంటుందని, ఓబీసీ, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం లేదని విమర్శించారు.
స్మృతి ఇరానీ మండిపాటు
మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఉండాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. కులాల వారీగా కోటా అడుగుతూ విపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
ఎన్నికలు కాగానే ప్రక్రియ చేపడతాం
-అమిత్ షా
గతంలో నాలుగుసార్లు మహిళలను ఈ పార్లమెంటు నిరాశ పరిచిందని, ఈ సారి అలాంటి పరిస్థితి తలెత్తదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లుపై చర్చలో ఆయన జోక్యం చేసుకుని మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు 2029 తర్వాత అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ‘సాధారణ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడో వంతు సీట్లను ఎవరు రిజర్వు చేయాలి? ఒకవేళ మేం చేస్తే వయనాడ్ లోక్సభ సీటు మహిళా రిజర్వేషన్ కిందికి వెళ్తే మేం రాజకీయం చేసినట్లు మీరే ఆరోపణలు చేస్తారు. ఒకవేళ హైదరాబాద్ సీటు రిజర్వు అయితే రాజకీయం చేశామని ఒవైసీ మాపై విమర్శలు గుప్పిస్తారు. అందుకే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అది ప్రతి రాష్ట్రంలో క్షేత్రస్థాయికి వెళ్లి బహిరంగ విచారణ ద్వారా పారదర్శక పద్ధతిలో నిబంధనలు రూపొందిస్తుంది’ అని పేర్కొన్నారు. ఈసారి సాంకేతిక సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి మేఘ్వాల్ తెలిపారు. డీలిమిటేషన్ కమిషన్ లేకుండా వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఈ బిల్లులో మహిళలకు సమాంతరంగా (హారిజంటల్), నిలువు (వర్టికల్) రిజర్వేషన్లు ఉన్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాజమాన్య విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. -
తనపై వీడియో క్లిప్ రావడంపై ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ ఆవేదన
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గురువారం రాజ్యసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభివాదం చేసే సమయంలో ఆయన చేతులు జోడించి, శరీరాన్ని ముందుకు వంచిన భంగిమను పరిహసించే రీతిలో ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమంలో ప్రచారంలోకి వచ్చింది. -
ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ప్రధాన కార్యదర్శి పాటించాల్సిందే
దేశరాజధాని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం నియమించినా, ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
అమెరికా, కెనడా ఆరోపణలపై సమాన వైఖరి సాధ్యం కాదు
అమెరికాలో సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్రలో భారతీయుడి పాత్రపై ఆ దేశం చేసిన ఆరోపణలపై మన దేశం దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ గురువారం పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు
ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక శుక్రవారం లోక్సభ ముందుకు రానుంది. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ
పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తోంది. -
తెలుగు సహా పది భాషల్లో కేశవానంద భారతి తీర్పు
‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు తెలుగు సహా పది భాషల్లోకి తర్జుమా చేసింది. -
అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. -
తేజస్ కొనుగోలుకు 4 దేశాల ఆసక్తి
దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ను కొనుగోలు చేసేందుకు నైజీరియా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్టు ఆసక్తి... -
9 మంది ఎంపీల రాజీనామాలకు లోక్సభ స్పీకర్ ఆమోదం
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన 9 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ఆమోదించారు. -
10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. -
11న 370 అధికరణం రద్దుపై సుప్రీం తీర్పు
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. -
కేరళ సీఎం, గవర్నర్ మధ్య మరోసారి మాటల యుద్ధం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. -
అర్జున్ ముండాకు వ్యవసాయశాఖ అదనపు బాధ్యతలు
కేంద్ర మంత్రి పదవులకు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్సింగ్ పటేల్, రేణుకాసింగ్ సమర్పించిన రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదించారు. -
సత్పుడా పులుల అభయారణ్యంలో 10 వేల ఏళ్లనాటి రాతి చిత్తరువులు
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో గల సత్పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు. -
చైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు భారత్లో లేవు : కేంద్రం
ఏప్రిల్ నుంచి సెప్టెంబరు దాకా ఆర్నెల్ల కాలంలో దిల్లీలోని ఎయిమ్స్లో ఏడు బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఖతార్లో మరణశిక్ష పడిన బాధితులతో భారత రాయబారి భేటీ
గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్లోని భారత రాయబారి కలిశారు. -
మెఫ్తాల్ వినియోగంతో దుష్ప్రభావాల ముప్పు!
కీళ్లవాతం, నెలసరి నొప్పిని తప్పించుకునేందుకు ప్రజలు అధికంగా వినియోగించే మెఫ్తాల్ ఔషధం కొన్ని దుష్ప్రభావాలకూ కారణమయ్యే ముప్పు లేకపోలేదని భారత ఔషధప్రబంధ కమిషన్ (ఐపీసీ) హెచ్చరించింది! -
బీరువాల నిండా నోట్ల కట్టలే
ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్కం ట్యాక్స్ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. -
Green energy park: అదానీ గ్రీన్ ఎనర్జీ పార్క్.. అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుందటా..
గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ గుజరాత్లో గ్రీన్ ఎనర్జీ పార్క్ నిర్మిస్తోంది. ఇది అంతరిక్షం నుంచి చూసిన కనిపిస్తుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
విద్యుత్పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం
-
బీబీసీ ఛైర్మన్గా సమీర్ షా
-
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య