జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ నేడు
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని జమిలి ఎన్నికల ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం శనివారం దిల్లీలో జరగనుంది.
దిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని జమిలి ఎన్నికల ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం శనివారం దిల్లీలో జరగనుంది. లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే విషయమై సంబంధిత పక్షాలన్నిటితో సంప్రదింపుల నిర్వహణకు అవసరమైన మార్గసూచీని రూపొందించుకోవడంపై కమిటీ చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న ఎనిమిది మంది సభ్యులతో ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి ఈ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు నిరాకరిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాంనబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి.కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి ప్రస్తుతం కమిటీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
గుజరాత్లో గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా చనిపోయిన 1052 మందిలో 80శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని ఆ రాష్ట్ర మంత్రి వెల్లడించారు. -
UGC: యూనివర్సిటీలు, కాలేజీల్లో సెల్ఫీ పాయింట్లు పెట్టండి..!
వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచేలా కాలేజీలు, యూనివర్సిటీలకు యూజీసీ కీలక సూచనలు చేసింది. -
Indian Navy: తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ను నియమించిన భారత నౌకాదళం
భారత నౌకా దళంలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ తెలిపారు. -
Bengaluru: తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందొద్దు: కర్ణాటక హోంమంత్రి విజ్ఞప్తి
బెంగళూరు నగరంలో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. -
Viral news: ఇదేం పెళ్లిరా బాబూ.. తుపాకీ ఎక్కుపెట్టి.. తాళి కట్టించి..!
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. బలవంతంగా తన కూతురి మెడలో తాళి కట్టించాడు. -
PM Modi: భారత్లో కాప్-33 సదస్సు.. దుబాయ్లో ప్రతిపాదించిన మోదీ
PM Modi: మరో ఐదేళ్ల తర్వాత ప్రపంచ వాతావరణ సదస్సును భారత్లో నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
Electricity bill: రూ.4,950 బిల్లుకు.. రూ.197 కోట్ల రసీదు
ఓ మహిళ రూ.4,950 విద్యుత్ బిల్లు చెల్లించగా.. ఆమెకు సిబ్బంది రూ.197 కోట్లు చెల్లించినట్లు రసీదు ఇచ్చారు. -
Supreme Court: సీఎంతో సమావేశమై సమస్యకు తెరదించండి.. తమిళనాడు గవర్నర్కు ‘సుప్రీం’ సూచన
బిల్లుల ఆమోద సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్తో సమావేశం నిర్వహించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీం కోర్టు కోరింది. -
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్ (Distinction) తాము కేటాయించమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. -
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
బెంగళూరు (Bengaluru)లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విడతలుగా ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. -
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
సరిహద్దులు సురక్షితంగా లేకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. -
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీలో మతపరమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుకు నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. -
పల్లెటూరి మేడం యూట్యూబ్ ఆంగ్ల పాఠాలు అదుర్స్
ఉత్తర్ప్రదేశ్లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. -
Gated community: గేటెడ్ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!
గేటెడ్ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
సిల్క్యారాలోనా.. సొంత ఊళ్లకా!
మృత్యువు అంచువరకు వెళ్లి రెండ్రోజుల క్రితం క్షేమంగా తిరిగివచ్చిన సిల్క్యారా సొరంగ కార్మికులు ఇప్పుడు అక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకోవాలా, సొంత ఊళ్లకు వెళ్లిపోవాలా అనే ఊగిసలాటలో ఉన్నారు. -
నా దృష్టిలో పెద్దకులాలు ఆ నాలుగే
‘నా దృష్టిలో నాలుగు పెద్ద కులాలవారంటే పేదలు, యువత, మహిళలు, రైతులు. వారి ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్
ఒడిశా అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) కనిపించింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) సుశాంత నందొ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వివరాలు వెల్లడించారు. -
కన్నూర్ వర్సిటీ వీసీగా రవీంద్రన్ పునర్నియామకం కొట్టివేత
కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ఛాన్సలర్/వీసీ)గా గోపీనాథ్ రవీంద్రన్ పునర్నియామకాన్ని సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. -
విమానంలో నీటి ధార
విమానంలో క్యాబిన్ పైకప్పు నుంచి ఏర్పడిన నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బంది పడిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. -
శోమాకాంతి సేన్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు శోమాకాంతి సేన్ ఆరోగ్య కారణాలతో సుప్రీంకోర్టులో పెట్టుకున్న మధ్యంతర బెయిల్ అభ్యర్థన పిటిషన్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గట్టిగా గురువారం వ్యతిరేకించింది.


తాజా వార్తలు (Latest News)
-
Naga Chaitanya: ఆ తర్వాత పట్టించుకోను: పర్సనల్ లైఫ్పై నాగచైతన్య కామెంట్స్
-
IND vs AUS: నాలుగో టీ20తోపాటు సిరీసూ భారత్దే..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
AP Inter: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
-
Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు
-
Rathnam: విశాల్- హరి కాంబో.. ఈసారి రక్తపాతమే.. టీజర్ చూశారా!