సూరత్లో రూ.600 కోట్ల వజ్ర గణపతి
గుజరాత్లోని సూరత్లో వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు.
గుజరాత్లోని సూరత్లో వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు. పరిమాణంలో ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతున్నారు. ఈ వజ్రం ధర గురించి కనుభాయ్ వెల్లడించకపోయినా.. మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పదిహేనేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం బెల్జియంలో పర్యటించిన కనుభాయ్ అక్కడి నుంచి ముడి వజ్రాలను భారత్కు తీసుకొచ్చారు. ‘‘అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు మా తండ్రికి కల వచ్చింది. పరిశీలిస్తే.. ఒక వజ్రం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో ఉంది. అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి మా కుటుంబం పూజలు చేస్తోంది’’ అని కనుభాయ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Supreme Court: మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరణ
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి (Senthil Balaji) అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
Uttarakhand Tunnel: సొరంగం వద్ద డ్రిల్లింగ్ పూర్తి.. కాసేపట్లో కూలీలు బయటకు..
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. సొరంగం వద్ద తవ్వకాలు పూర్తయ్యాయి. -
Madras HC: కలెక్టర్లకు ఈడీ నోటీసులు చట్ట విరుద్ధం: మద్రాసు హైకోర్టు
తమిళనాడులోని అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద ఐదుగురు జిల్లా కలెక్టర్లకు ఈడీ జారీ చేసిన నోటీసులపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. -
Kota: నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో కోటాలో 28కి చేరిన మరణాలు
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాది అక్కడ జరిగిన బలవన్మరణాల సంఖ్య 28కి చేరుకుంది. -
Kangana Ranaut: ఇందిరాగాంధీతో కంగన చిట్చాట్.. అదెలా సాధ్యమంటే..?
కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’(Emergency) చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలు వైరల్గా మారాయి. -
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. నేలకు సమాంతరంగా చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్లో ఇంకా 10 మీటర్ల తవ్వకాలు పూర్తిచేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. -
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్పుర్కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. -
36 మీటర్లు పూర్తయిన తవ్వకం
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది. -
మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు
అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభివర్ణించారు. -
Jagdeep Dhankar: గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్
ప్రముఖ జైన మత గురువు, ఆధ్యాత్మిక వేత్త శ్రీమద్ రాజ్చంద్రాజీ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: ఆద్యంతం ఒడుదొడుకులు.. ఆఖర్లో లాభాలు.. 19,880 ఎగువన నిఫ్టీ
-
Rashmika: అవధులు లేని మీ అభిమానానికి కృతజ్ఞతలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక
-
Australia: మిగిలిన టీ20లకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు..!
-
Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ
-
Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
-
Zuckerberg: రోజుకు 4వేల కేలరీల ఆహారం తీసుకుంటా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న జుకర్బర్గ్