ప్రజల ఆకాంక్షలే ఎజెండా
దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను భారీస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.
ఆ దిశగా మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరుస్తున్నాం
వందేభారత్ రైళ్ల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ
ఒకేసారి 9 సెమీ హైస్పీడ్ ఎక్స్ప్రెస్లకు పచ్చజెండా
దిల్లీ
దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను భారీస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాల మధ్య వేర్వేరు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను కలిపే తొమ్మిది వందేభారత్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండాఊపి ప్రారంభించి, ప్రసంగించారు. రైల్వేల ఆధునికీకరణపై మునుపటి ప్రభుత్వాలు తగినంత దృష్టి సారించలేదని, తాము చేపట్టిన చర్యల ద్వారా దేశంలో అన్ని ప్రాంతాలనూ వందేభారత్లు అనుసంధానం చేసేరోజు ఎంతో దూరంలో లేదని మోదీ చెప్పారు. ఇవి అమిత ప్రజాదరణ పొందుతున్నాయని, ఇప్పటికే 25 రైళ్లలో 1.11 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు. ‘పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత విశ్వసనీయ నేస్తం భారతీయ రైల్వే. మన రైళ్లలో ఒకరోజులో ప్రయాణించేవారి సంఖ్య ఎన్నో దేశాల జనాభాకంటే ఎక్కువ. రైల్వేలో మేం తీసుకువస్తున్న మార్పులు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మారుస్తాయి. రైల్వే మంత్రుల సొంత రాష్ట్రంలోనే రైల్వేను అభివృద్ధి చేయాలనే స్వార్థపర ఆలోచన దేశాన్ని ఎంతో నష్టపరిచింది. ఏ రాష్ట్రాన్నీ విస్మరించకుండా అందరితో కలిసి అందరి అభివృద్ధికి పాటుపడాలనేదే మా విధానం’ అని వివరించారు.
ప్రయాణికుల సూచనలతో మార్పులు
వందేభారత్ కొత్తరైళ్లలో సదుపాయాలను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సలహాలు, సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. సీట్లు మరింత వెనక్కి వాలేలా సౌకర్యవంతంగా మార్చారు. మెత్తటి కుషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ సీట్ల రంగును ఎరుపు నుంచి నీలానికి మార్చడంతోపాటు, సీట్ల వెనుక మ్యాగజైన్లు ఉంచుకొనే ఏర్పాటు చేశారు. సీట్ల కింద ఉండే ఛార్జింగ్ పాయింట్లను సులువుగా వాడుకునేలా మార్చారు. మరుగుదొడ్లలో దీపాల కాంతి పెంచారు. వాష్బేసిన్ నుంచి నీళ్లు బయటికి చిమ్మకుండా వాటి లోతు పెంచారు. దివ్యాంగుల చక్రాల కుర్చీలు భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్లు కేటాయించారు. మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం ప్యానెల్స్లో మార్పులు చేశారు. రైలుపెట్టెల్లో అగ్ని ప్రమాదాలను గుర్తించే వ్యవస్థను మరింత మెరుగుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
Mamata Banerjee: టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటును ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఖండించారు. ఈ యుద్ధాన్ని ఆమె తప్పకుండా గెలుస్తారంటూ ఆమెకు అండగా నిలిచారు. -
Maharashtra: ఘోరం.. కొవ్వొత్తుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్ర (Maharashtra)లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్ షా
దేశ యువత కోసం బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తోందని, గత పదేళ్లలో దేశంలో అవినీతి, బంధుప్రీతి, కులతత్వాన్ని అభివృద్ధి భర్తీ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. -
ఘోరం.. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు మృతి..!
పశ్చిమ్ బెంగాల్(West Bengal)లోని ఓ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకరోజు వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. -
PM Modi: ‘వెడ్ ఇన్ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన
భారత్లో ‘వెడ్ ఇన్ ఇండియా’ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్న కుటుంబాల వారు ప్రారంభించాలని ప్రధాని మోదీ కోరారు. -
Supreme Court: నేను రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ఓ న్యాయమూర్తిగా.. చట్టం, రాజ్యాంగానికి తానో సేవకుడినని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI D Y Chandrachud) పేర్కొన్నారు. -
Mahua Moitra: మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసులో ఆమెపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది. -
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
Fake Toll Plaza: గుజరాత్లో ఘరానా మోసం బయటపడింది. కొందరు మోసగాళ్లు ఏకంగా రోడ్డు వేసి.. మధ్యలో టోల్ ప్లాజా కట్టేశారు. ఏడాదిన్నరగా రూ. కోట్లు వసూలు చేస్తున్నా అధికారులు దీన్ని గుర్తించకపోవడం గమనార్హం. -
Supreme Court: విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం: మద్యం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
Bullet Train: తొలి బుల్లెట్ రైలు స్టేషన్ను వీక్షించారా..?
ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ప్రాజెక్టు రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి ఎక్స్ (ట్విటర్)లో విడుదల చేశారు. -
Mahua Moitra: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక
Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. -
మోదీజీతో మా నాన్న.. కంగారేస్తోంది: స్మృతి ఇరానీ పోస్టు వైరల్
కేంద్రమంత్రి స్మృతిఇరానీ(Smriti Irani) నెట్టింట్లో చేసిన పోస్టు వైరల్గా మారింది. దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. -
Indian students: విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి.. అత్యధికంగా కెనడాలోనే
Indian students: గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కెనడాలో అత్యధిక మరణాలు సంభవించాయి. -
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. -
బీరువాల నిండా నోట్ల కట్టలే
ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్కం ట్యాక్స్ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ
పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తోంది. -
సత్పుడా పులుల అభయారణ్యంలో 10 వేల ఏళ్లనాటి రాతి చిత్తరువులు
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో గల సత్పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు. -
11న 370 అధికరణం రద్దుపై సుప్రీం తీర్పు
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. -
దుష్యంత్ దవే లేఖపై ఎస్సీబీఏ అధ్యక్షుడి దిగ్భ్రాంతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బహిరంగ లేఖ రాయడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు ఆదిశ్ సి అగ్రవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మోదీ చిత్రంతో విద్యార్థుల సెల్ఫీలు తప్పనిసరేమీ కాదు
ప్రధాని మోదీ చిత్రంతో విద్యార్థులు సెల్ఫీ దిగేందుకు వీలుగా కళాశాలల్లో ఒక సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్థించుకున్నారు. -
యాజమాన్య విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు.


తాజా వార్తలు (Latest News)
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్