పసిప్రాణాన్ని కాపాడిన వృద్ధులు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని చేత్‌గంజ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ముగ్గురు వృద్ధుల చొరవ ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది.

Published : 28 Sep 2023 05:20 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని చేత్‌గంజ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ముగ్గురు వృద్ధుల చొరవ ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. మంగళవారం ఆ వీధిలో భారీవర్షం కురిసింది. కాస్త తెరిపి ఇవ్వగానే స్థానికుడైన జితేంద్ర కుమారుడు కార్తీక్‌ (10) ఆడుకోడానికి బయటకు వచ్చాడు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తుతీగలు రహదారిపై స్తంభానికి సమీపంగా నిలిచిన వర్షపునీటిలో పడ్డాయి. ఆ మడుగులో అడుగుపెట్టిన కార్తీక్‌ షాక్‌కు గురై అక్కడే పడిపోయి విలవిలలాడాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న ముగ్గురు వృద్ధులు బాలుణ్ని గమనించారు. అందులో ఒకరు పరుగున వెళ్లి చిన్నారిని పైకి లేపేందుకు ప్రయత్నించారు. విద్యుత్తు ప్రసరిస్తున్నట్లు గ్రహించాక వెనక్కి తగ్గారు. మిగతా ఇద్దరు వృద్ధులు ఓ కర్రను తీసుకొచ్చి.. దాన్ని నెమ్మదిగా బాలుడి చేతికి అందించారు. చిన్నారి కర్రను పట్టుకోగానే అతణ్ని బురద నీటిలో నుంచి పక్కకు లాగారు. సీసీటీవీలో రికార్డయిన ఈ ఘటన వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని