Puri Rath Yatra: నేడు పూరీ రథయాత్ర

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు

Updated : 12 Jul 2021 09:16 IST

ఈసారీ భక్తులు లేకుండానే వేడుక

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర సోమవారం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు వేడుక చేపట్టనున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్‌, తాళధ్వజ్‌, దర్పదళన్‌ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు (చతుర్థామూర్తులు) శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరుతారు.  భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి, పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు డీజీపీ అభయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని