Lottery: దుబాయ్లో భారతీయుడికి జాక్పాట్
భారత్కు చెందిన ప్రైవేటు నౌక ఉద్యోగి గణేశ్ శిండేను దుబాయ్లో అదృష్టం వరించింది. ఏకంగా మిలియన్ డాలర్ల (రూ.7.45 కోట్లు) లాటరీని ఆయన గెల్చుకున్నారు. మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన గణేశ్.. బ్రెజిల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.
లాటరీలో రూ.7.45 కోట్లు సొంతం
దుబాయ్: భారత్కు చెందిన ప్రైవేటు నౌక ఉద్యోగి గణేశ్ శిండేను దుబాయ్లో అదృష్టం వరించింది. ఏకంగా మిలియన్ డాలర్ల (రూ.7.45 కోట్లు) లాటరీని ఆయన గెల్చుకున్నారు. మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన గణేశ్.. బ్రెజిల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. వృత్తిలో భాగంగా బ్రెజిల్ నుంచి దుబాయ్కి వచ్చినప్పుడల్లా లాటరీ టికెట్ కొనేవారు. అలా రెండేళ్లుగా కొంటున్న గణేశ్కు ఇన్నాళ్లకు జాక్పాట్ తగిలింది. ఆయన కొన్న మిలీనియం మిలియనీర్ లాటరీ టికెట్తో ఒక్కరోజులో కోటీశ్వరుడైపోయారు. దీంతో గణేశ్ పట్టరాని ఆనందంలో తేలిపోతున్నారు. ‘‘కొత్త కారు, కొత్త ఫ్లాటు కొంటాను. పిల్లల చదువుకు కొంత డబ్బు దాచుకుంటాను. ఇంకా చాలా కోరికలున్నాయి’’ అని గణేశ్ చెప్పారు. 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్ లాటరీలో ఇప్పటివరకూ 181 మంది భారతీయులు విజేతలుగా నిలవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM