WhatsApp: వాట్సప్‌ ద్వారా పింఛన్‌ చీటీ

పింఛనుదారులకు బ్యాంకుల నుంచి వాట్సప్‌ ద్వారా పింఛను చీటీలు (స్లిప్పులు) అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాతాల్లో పింఛను జమ అయిన వెంటనే సంబంధిత సమాచారాన్ని పింఛనుదారులకు చేరవేసేందుకు ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌లతో పాటు వాట్సప్‌నూ వినియోగించుకోవచ్చునని బ్యాంకులకు

Updated : 16 Jul 2021 09:15 IST

దిల్లీ: పింఛనుదారులకు బ్యాంకుల నుంచి వాట్సప్‌ ద్వారా పింఛను చీటీలు (స్లిప్పులు) అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాతాల్లో పింఛను జమ అయిన వెంటనే సంబంధిత సమాచారాన్ని పింఛనుదారులకు చేరవేసేందుకు ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌లతో పాటు వాట్సప్‌నూ వినియోగించుకోవచ్చునని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పింఛనుదారుల జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జమ అయిన సొమ్ము, పన్ను మినహాయింపుల వంటి వివరాలన్నీ చీటీలో ఉంటాయని పేర్కొంది. ఆదాయపు పన్ను, కరవు భృతి  చెల్లింపులు తదితర వ్యవహారాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని