Ecuador: ఈక్వెడార్ జైల్లో శవాల కుప్పలు
ఈక్వెడార్లో గాయక్విల్ నగరంలోని లిటోరల్ జైల్లో చెలరేగిన ఘర్షణ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అక్కడ మృతుల సంఖ్య బుధవారం నాటికి 116కు పెరిగింది. రెండు ముఠాల సభ్యులు కారాగారంలో...
116కు పెరిగిన మృతుల సంఖ్య
కారాగారాల్లో అత్యయిక స్థితి విధింపు
క్విటో: ఈక్వెడార్లో గాయక్విల్ నగరంలోని లిటోరల్ జైల్లో చెలరేగిన ఘర్షణ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అక్కడ మృతుల సంఖ్య బుధవారం నాటికి 116కు పెరిగింది. రెండు ముఠాల సభ్యులు కారాగారంలో తుపాకులు, కత్తులు, బాంబులతో మంగళవారం పరస్పరం దాడులు చేసుకొని బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 80 మందికి గాయాలయ్యాయి. ఈక్వెడార్ చరిత్రలో జైళ్లలో చోటుచేసుకున్న అతిపెద్ద మారణహోమమిదే. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈక్వెడార్ వ్యాప్తంగా జైళ్లలో అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు గిలెర్మో లసో ప్రకటించారు. వాటిలో అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు. ఏరులై పారిన రక్తం, తెగిపడిన శరీర భాగాలు, పేలుళ్ల విధ్వంసంతో లిటోరల్ జైల్లో పరిస్థితులు భయానకంగా కనిపించాయి. ఒక్కోచోట మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. మృతుల్లో ఐదుగురి తలలు మొండేల నుంచి వేరయ్యాయి. తరచూ ఘర్షణలు తలెత్తుతుండటంతో ఈ ఏడాది జులైలో కూడా ఈక్వెడార్ కారాగారాల్లో అత్యయిక స్థితి విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు