చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే బీమా దరఖాస్తు తిరస్కరించొచ్చు
వాహనానికి చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే బీమా క్లెయింను తిరస్కరించొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. చోరీ అయిన ఓ కారుకు సంబంధించిన బీమా వివాదంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ పత్రాల గడువు తీరి ఉండడంతో....
కారు చోరీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు
ఈనాడు, దిల్లీ: వాహనానికి చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే బీమా క్లెయింను తిరస్కరించొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. చోరీ అయిన ఓ కారుకు సంబంధించిన బీమా వివాదంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ పత్రాల గడువు తీరి ఉండడంతో బీమా క్లెయింను తిరస్కరించింది. పాలసీ నిబంధనలు, షరతుల ప్రాథమిక ఉల్లంఘన జరిగినట్లు తేలితే బీమా మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించొచ్చని స్పష్టం చేసింది. రాజస్థాన్కు చెందిన ప్రైవేటు కాంట్రాక్టర్ సుశీల్ కుమార్ గోడారా తన బొలెరో వాహనానికి పంజాబ్లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ నుంచి రూ.6.17 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నాడు. ఆ వాహనానికి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ గడువు 2011 జులై 19న ముగిసిపోయింది. అదే నెల 28న అతడి కారు జోధ్పుర్లో కనిపించకుండా పోయింది. అక్కడి పోలీస్ స్టేషన్లో అతడు కేసు పెట్టాడు. కారు ఆచూకీ తెలియలేదంటూ పోలీసులు తుది నివేదిక ఇచ్చారు. బీమా మొత్తం కోసం సుశీల్ కుమార్ క్లెయిం చేసుకోగా రిజిస్ట్రేషన్ లేనందున చెల్లించలేమంటూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ తిరస్కరించింది. సుశీల్ రాజస్థాన్లోని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార మండలిని ఆశ్రయించగా అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బీమా సంస్థ జాతీయ మండలిలో రివ్యూ పిటిషన్ వేసింది. అక్కడా బీమా చెల్లించాల్సిందేనంటూ తీర్పు వచ్చింది. దీనిపై ఆ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ‘‘చోరీ జరిగిన రోజున కారును చెల్లుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండానే వినియోగించారు. అంటే మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారు. కాబట్టి బీమా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టమవుతోంది. ఈ సందర్భంలో బీమా క్లెయింను తిరస్కరించడానికి ఇన్సూరెన్స్ సంస్థకు హక్కు ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది.
వాహనాల పత్రాలన్నీ అక్టోబర్ 31 వరకు చెల్లుబాటు
దిల్లీ: వాహనాల పత్రాలన్నీ అక్టోబరు 31వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. డ్రైవింగ్ లైసెన్సు, ఫిట్నెస్, అన్ని రకాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత నవీకరణ (రెన్యువల్) చేయించుకోని వారి పత్రాల గడువును అక్టోబరు 31 వరకు పొడిగించామని, అంతవరకు అవి చెల్లుబాటు అవుతాయని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం