‘బాణసంచా’లో ఇంకా నిషిద్ధ పదార్థాలు
పర్యావరణానికి హాని కలిగించని హరిత బాణసంచా తయారు చేస్తున్నామని చెప్పి అందులోనూ నిషిద్ధ పదార్థాలను ఉపయోగిస్తుండడాన్ని బుధవారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పటాసులు, ఇతర పేలుడు
పటాసుల నిషేధాన్ని అమలు చేయాల్సిందే: సుప్రీం
దిల్లీ: పర్యావరణానికి హాని కలిగించని హరిత బాణసంచా తయారు చేస్తున్నామని చెప్పి అందులోనూ నిషిద్ధ పదార్థాలను ఉపయోగిస్తుండడాన్ని బుధవారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పటాసులు, ఇతర పేలుడు స్వభావం ఉన్న మందుగుండును నిషేధిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది. పండగకు తాము వ్యతిరేకం కాదని, అయితే అది ఇతరులకు నష్టం కలిగించకూడదని స్పష్టం చేసింది. కాకర పువ్వొత్తులు వంటివి ఉపయోగించి కూడా పండగ చేసుకోవచ్చని, శబ్దాలు చేసే టపాకాయలే అవసరం లేదని తెలిపింది. పటాసులపై నిషేధం ఉన్నప్పటికీ, మార్కెట్లో అవి ఎలా లభ్యమవుతున్నాయని ప్రశ్నించింది. తొలుత పిటిషన్దారు అర్జున్ గోపాల్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ మాట్లాడుతూ బాణసంచా వినియోగం వల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై సీబీఐ చేసిన దర్యాప్తు ఆధారంగా అదనపు ప్రమాణ పత్రం సమర్పించామని చెప్పారు. బాణసంచా తయారీదార్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ ఈ రంగంపై అయిదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. తయారీ కేంద్రమైన తమిళనాడులోని శివకాశిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ధర్మాసనం దీంతో ఏకీభవించలేదు. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ