ముంబయి దాడులపై దీటుగా స్పందించని యూపీఏ
కాంగ్రెస్ నేత, ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం.. రాజకీయ దుమారానికి దారితీసింది. 2008 ముంబయి ఉగ్రదాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదని ఈ పుస్తకంలో ప్రస్తావించడమే ఇందుకు కారణం.
తాజా పుస్తకంలో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ
దిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం.. రాజకీయ దుమారానికి దారితీసింది. 2008 ముంబయి ఉగ్రదాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదని ఈ పుస్తకంలో ప్రస్తావించడమే ఇందుకు కారణం. గత రెండు దశాబ్దాల్లో జాతీయ భద్రతకు ఎదురైన సవాళ్లపై ‘10 ఫ్లాష్ పాయింట్స్: 20 ఇయర్స్’ పేరిట మనీశ్ తివారీ తాజాగా పుస్తకం రాశారు. యావత్ దేశాన్ని వణికించిన ముంబయి దాడుల గురించి అందులో ప్రస్తావించారు. ‘‘వందలాది అమాయకులను క్రూరంగా హతమార్చిన సందర్భంలో సహనంతో ఉండడమనేది బలానికి సంకేతం కాదు. అది కచ్చితంగా బలహీనతకు సంకేతమే.. కొన్ని సందర్భాల్లో మాటలకంటే చేతలతోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 26/11 దాడుల ఘటన కూడా అటువంటి సమయమే.. ఆ సమయంలో భారత్ ప్రతిస్పందన మరింత బలంగా ఉండాల్సింది.’’ అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే భాజపా స్పందించింది. జాతీయ భద్రత విషయంలో యూపీఏ ప్రభుత్వం ఎంత బలహీనంగా వ్యవహరించిందో స్పష్టమైందని మండిపడింది. ‘‘కాంగ్రెస్ పార్టీ జాతీయ భద్రతను పట్టించుకోలేదు. పాకిస్థాన్పై దీటుగా స్పందించేందుకు అప్పట్లో మన సైన్యానికి ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదు? కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ గాంధీలు ఈ విషయంపై మౌనం వీడుతారా?’’ అని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ప్రశ్నించారు. 2008 నవంబరు 26న సముద్ర మార్గంలో ముంబయిలోకి చొరబడిన 10 మంది పాక్ ఉగ్రవాదులు 166 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనలో పట్టుబడిన ఒకే ఒక్క ఉగ్రవాది కసబ్ను నాలుగేళ్ల అనంతరం ఉరితీసిన విషయం తెలిసిందే.
అప్పుడే ఎందుకు స్పందించలేదు: అధీర్
మనీశ్ తివారీ తాజా పుస్తకంలో యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్న మనీశ్.. ఈ విషయాన్ని అప్పుడు లేవెనెత్తలేదన్నారు. ముంబయి దాడులకు బదులుగా.. ఇటీవల కాలంలో ఆందోళనగా మారిన చైనా దూకుడు, భారత్ సరిహద్దుల్లో పెరిగిన చైనా కార్యకలాపాలపై రాయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు