600 మంది పిల్లల్ని ఇళ్లకు చేర్చిన ‘బజరంగీ భాయిజాన్‌’

‘బజరంగీ భాయిజాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ తప్పిపోయిన ఓ మూగ బాలికను ఎంతో శ్రమకోర్చి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. హరియాణాకు చెందిన ఏఎస్‌ఐ రాజేశ్‌ కుమార్‌ దాదాపు 600 మంది పిల్లల్ని తిరిగి

Updated : 07 Dec 2021 08:45 IST

‘బజరంగీ భాయిజాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ తప్పిపోయిన ఓ మూగ బాలికను ఎంతో శ్రమకోర్చి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు. హరియాణాకు చెందిన ఏఎస్‌ఐ రాజేశ్‌ కుమార్‌ దాదాపు 600 మంది పిల్లల్ని తిరిగి తమ ఇళ్లకు చేర్చి నిజజీవిత బజరంగీ భాయిజాన్‌గా మారారు. మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో పనిచేసే రాజేశ్‌ 2016 నుంచి 600 మందికిపైగా పిల్లలు, మహిళలు, వృద్ధులను.. తిరిగి తమ కుటుంబాలతో కలిపారు. ఓసారి బాలల గృహానికి వెళ్లగా.. అక్కడ పిల్లలు తమను తల్లిదండ్రులతో కలపాలని అడిగారని చెప్పారు రాజేశ్‌. అప్పుడే అలాంటివారి బాధలు తీర్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తప్పిపోయినవారితోపాటు కిడ్నాప్‌ అయిన పిల్లలను కూడా రక్షించినట్లు చెప్పారు. మానసిక స్థితి సరిగా లేని వారు, మాట్లాడలేని వారిని తమ ఇళ్లకు చేర్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని