Bharat biotech: శబరిమలలో అన్నదానానికి భారత్ బయోటెక్ రూ.కోటి విరాళం
ఔషధ సంస్థ భారత్ బయోటెక్ ఎండీ డా.కృష్ణ ఎల్ల సతీసమేతంగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కోసం ఆలయానికి రూ.కోటి విరాళం ప్రకటించారు. శబరిమల కార్యనిర్వాహక
భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల ఉదారత
అయ్యప్పస్వామిని దర్శించుకుంటున్న డా.కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల
శబరిమల: ఔషధ సంస్థ భారత్ బయోటెక్ ఎండీ డా.కృష్ణ ఎల్ల సతీసమేతంగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కోసం ఆలయానికి రూ.కోటి విరాళం ప్రకటించారు. శబరిమల కార్యనిర్వాహక అధికారి వి.కృష్ణకుమార్ వారియర్కు నగదును ఆన్లైన్ ద్వారా బదిలీ చేశారు. భారీ విరాళం అందించి ఉదారత్వాన్ని చాటుకున్న డా.కృష్ణ ఎల్ల దంపతులకు ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు అధ్యక్షుడు అనంతగోపన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, శబరిమల అభివృద్ధిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డా.కృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?