Debt: ఇప్పుడు మన దేశం అప్పు ఎంతో తెలుసా?
భారతదేశ అప్పు గత 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్
ఈనాడు, దిల్లీ: భారతదేశ అప్పు గత 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51లో దేశం నికర అప్పు రూ.2,565.40 కోట్లు ఉండగా, 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సహ చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62,42,220.92 కోట్లు ఉండగా, 2021-22 బడ్జెట్ నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. ఏడేళ్లలో 117% పెరిగింది. 64 ఏళ్లలో దేశం రుణం రూ.62.42 లక్షల కోట్ల మేర ఉండగా, గత ఏడేళ్లలోనే కొత్తగా రూ.73,44,754 కోట్ల అప్పు చేసినట్లు ఈ సమాచారం ద్వారా వెల్లడైంది. 1950-51లో దేశ అంతర్గత రుణం రూ.2,022.30 కోట్లు, విదేశీ రుణం రూ.32.03 కోట్లమేర ఉండగా, 2021-22 నాటికి అంతర్గత రుణం రూ.1,13,57,415 కోట్లు, విదేశీ రుణం రూ.4,27,925.24 కోట్లకు ఎగబాకింది. ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఎఫ్సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు. ఇప్పుడు ఆ రాయితీల భారం రూ.1,62,827.90 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె