Marriage: చనిపోయాడని భార్యకు మళ్లీ పెళ్లి.. 12 ఏళ్లకు ఆచూకీ!
పన్నెండేళ్ల క్రితం అతడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. చాలా రోజులపాటు ఎక్కడెక్కడో వెదికిన కుటుంబసభ్యులు చనిపోయాడని భావించి తుది కర్మలు కూడా పూర్తి చేశారు.
పన్నెండేళ్ల క్రితం అతడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. చాలా రోజులపాటు ఎక్కడెక్కడో వెదికిన కుటుంబసభ్యులు చనిపోయాడని భావించి తుది కర్మలు కూడా పూర్తి చేశారు. భర్త ఇక లేడని.. రెండేళ్ల తర్వాత భార్య మళ్లీ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అనూహ్యంగా అతడి ఆచూకీ తెలిసింది. బిహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖిలాఫత్పుర్ గ్రామవాసి ఛావీ ముశాహర్.. 12 ఏళ్ల క్రితం అదృశ్యం కాగా, ఇప్పుడు పాకిస్థాన్లోని ఓ జైలులో బందీగా ఉన్నాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఇంతకూ ఈ విషయం ఎలా తెలిసిందంటే.. పాకిస్థాన్ జైలులో ఉన్న ఓ వ్యక్తిని గుర్తించాలంటూ భారత విదేశాంగశాఖ నుంచి ముఫాసిల్ ఠాణాకు లేఖ అందింది. పోలీసులు ఖిలాఫత్పుర్ దళితవాడకు చేరుకొని ఊరంతా ఆరా తీశారు. అది 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఛావీ ముశాహర్ చిత్రమని కుటుంబసభ్యులు గుర్తించారు. తన కుమారుణ్ని వెంటనే తీసుకురావాలని ఛావీ తల్లి ప్రభుత్వాన్ని కోరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్