Aadhaar:ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానం..నేడు లోక్సభ ముందుకు బిల్లు
ఓటరు జాబితాలో డూప్లికేషన్ను నివారించే దిశగా కీలక ముందడుగు పడనుంది! ఈ జాబితాను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించేందుకు వీలు కల్పించే ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది.
దిల్లీ: ఓటరు జాబితాలో డూప్లికేషన్ను నివారించే దిశగా కీలక ముందడుగు పడనుంది! ఈ జాబితాను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించేందుకు వీలు కల్పించే ‘ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021’ని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టనుంది. కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి గుర్తింపు ధ్రువీకరణ కోసం ఆధార్ నంబరు కోరేందుకు అధికారులను ఇది అనుమతిస్తుంది. ఇప్పటికే ఓటరుగా నమోదు చేసుకున్నవారి నుంచి ఆధార్ను సేకరించేందుకూ వీలు కల్పిస్తుంది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటుహక్కు ఉంటే గుర్తించి తొలగించేందుకు దోహదపడుతుంది. తదనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950, 1951ల్లోని సెక్షన్లకు సవరణలు చేపట్టనున్నారు. ఎన్నికల సంస్కరణల పథంలో ఈ బిల్లు కీలకంగా మారనుంది. ఆధార్ నంబరు ఇవ్వలేకపోయినంత మాత్రాన ఏ ఒక్కరికీ ఓటుహక్కు నిరాకరించకూడదని తాజా బిల్లులోని నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ప్రత్యామ్నాయ ధ్రువపత్రాలతో వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశమివ్వాలని సూచిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..