Crime News: కుక్క పిల్లకు తన భార్య మారుపేరు పెట్టారంటూ వివాదం
కుక్క పిల్లకు కావాలనే మారుపేరు పెట్టిందంటూ గుజరాత్లో ఓ మహిళపై పొరిగింటివారు దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాల పాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భావ్నగర్ జిల్లా పలిటానా పట్టణంలో ఉండే నీతాబెన్ సర్వైయా (35) ఓ కుక్క పిల్లను పెంచుకుంటోంది.
గుజరాత్లో మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించిన పొరుగింటివారు
భావ్నగర్: కుక్క పిల్లకు కావాలనే మారుపేరు పెట్టిందంటూ గుజరాత్లో ఓ మహిళపై పొరిగింటివారు దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాల పాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భావ్నగర్ జిల్లా పలిటానా పట్టణంలో ఉండే నీతాబెన్ సర్వైయా (35) ఓ కుక్క పిల్లను పెంచుకుంటోంది. దానికి ‘సోను’ అని పేరుపెట్టుకుంది. పొరిగింట్లో ఉండే వ్యక్తి సురభాయ్ భార్వాడ్ భార్య మారుపేరు కూడా సోనూయే. దీంతో వారు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతోపాటు నీటి కోసం కూడా గొడవలు జరిగినా.. తర్వాత వాటిని సామరస్యంగా పరిష్కరించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నీతాబెన్ భర్త, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లగా ఆమె ఇంట్లో పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో చిన్న కుమారుడు ఆమెతోపాటు ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన సురభాయ్ భార్వాడ్ సహా ఆరుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం నేరుగా వంటగదిలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నీతాబెన్పై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. మంటలకు తాళలేక ఆమె కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో నీతాబెన్ భర్త రావడంతో.. ఆయన కోటుతో మంటలను ఆర్పారు. బాధితురాలు ప్రస్తుతం భావ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశామని, ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM