ఖరీదైన చలిమంట.. చలి కాచుకునేందుకు ఓ దొంగ చేశాడంటే!
ప్రస్తుత శీతాకాలంలో చలి కారణంగా దేశప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా కొందరు.. కర్రలకు నిప్పంటించి చలి కాచుకుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ మాత్రం.. చలికాచుకునేందుకు చోరీ చేసిన
ముంబయి: ప్రస్తుత శీతాకాలంలో చలి కారణంగా దేశప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా కొందరు.. కర్రలకు నిప్పంటించి చలి కాచుకుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ మాత్రం.. చలికాచుకునేందుకు చోరీ చేసిన ద్విచక్ర వాహనానికే నిప్పంటించాడు. నాగ్పుర్లోని యశోధరానగర్లో తమ వాహనాలు చోరీకి గురయ్యాయంటూ అనేక మంది ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చోటా సర్ఫరాజ్తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముఠా 10 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు తేలింది. వాటిలో.. 9 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పదో వాహనం గురించి సర్ఫరాజ్ను ప్రశ్నించగా.. ‘‘బాగా చల్లగా ఉంటోంది. అందుకే చలి కాచుకునేందుకు ఆ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టాను’’ అని తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!