Omicron:ఒమిక్రాన్ నుంచి కోలుకుంటే డెల్టా నుంచీ రక్షణ!
కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి, కోలుకున్నవారికి డెల్టా రకం నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీంతో ఇలాంటివారు డెల్టాతో ఇబ్బందిపడే అవకాశం...
జొహెన్నెస్బర్గ్: కరోనా వైరస్లోని ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి, కోలుకున్నవారికి డెల్టా రకం నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీంతో ఇలాంటివారు డెల్టాతో ఇబ్బందిపడే అవకాశం తక్కువేనని వెల్లడైంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై చిన్నపాటి పరిశోధన జరిపారు. ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డ కొందరిని పరిశీలించారు. వీరిలో టీకాలు పొందినవారు, పొందనివారు ఉన్నారు. వీరి నుంచి యాంటీబాడీలతో కూడిన ప్లాస్మాను శాస్త్రవేత్తలు సేకరించారు. అది ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లను ఎంతమేర కట్టడి చేయగలదన్నది ల్యాబ్లో పరిశీలించారు. పరీక్షార్థుల్లో వ్యాధి లక్షణాలు కనిపించిన దశలోను, ఆ తర్వాత రెండు వారాలకు ఈ పరిశీలన సాగింది. ఈ వ్యవధిలో ఒమిక్రాన్కు స్పందనగా యాంటీబాడీ స్పందన 14 రెట్లు పెరిగినట్లు గుర్తించారు. ఇదే తరుణంలో డెల్టాను నిర్వీర్యం చేసే సత్తా 4.4 రెట్లు పెరిగినట్లు తేల్చారు. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకున్నవారికి డెల్టా వైరస్ సోకే అవకాశం తక్కువేనని స్పష్టమవుతోంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ అలెక్స్ సిగల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్